Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోడీకి ఆహ్వానం..
- ఇరాన్ ఆహ్వానంతో ఇరకాటంలో మోడీ సర్కార్..
- ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ సంబంధాల నేపథ్యంలో ప్రాధాన్యత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khamenei funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానించారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. జూలై 4 నుంచి 9 మధ్య ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలతో పాటు మోడీకి ఆహ్వానం అందింది. అయితే, ఇప్పుడు ఈ ఆహ్వానం భారత్ను దౌత్య సంకటంలో పడేసింది. ఇరాన్తో భారత్కు ఉన్న చారిత్రక సంబంధాలు, యూఎస్-ఇజ్రాయిల్తో ఉన్న వ్యూహాత్మక సంబంధాల మధ్య భారత విదేశాంగ విధానానికి కీలక పరీక్షగా మారింది.
అయితే, ఖమేనీ అంత్యక్రియలకు మోడీ స్వయంగా హాజరయ్యే అవకాశం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఆ సమయంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉండే అవకాశం ఉంది. భారత్ తరుఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇరాన్తో భారత్కు చారిత్రాత్మక సంబంధాలతో పాటు చమురు, వాణిజ్యం వంటి దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా, భారత్ పెట్టుబడులు పెట్టిన చాబహార్ పోర్టు చాలా కీలకంగా ఉంది. మరోవైపు అమెరికాతో భారత్కు బలమైన వాణిజ్య సంబంధాలు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్తో వ్యూహాత్మక రక్షణ, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో సహకారం ఉంది.
Also Read
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
- Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
- UP: మహిళలపై అఖిలేష్ ఎన్నికల వరాలు.. ఏడాదికి రూ.40 వేలు సాయం ప్రకటన
ఒక వేళ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తన ప్రతినిధి బృందాన్ని పంపితే, ఇరాన్తో సంబంధాలకు భారత్ ప్రాధాన్యత ఇచ్చే విషయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో దీనిని అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చూస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2024లో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు భారత్ ఒక రోజు సంతాప దినాన్ని ప్రకటించింది. అప్పటి ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ను అంత్యక్రియలకు పంపింది. ఈసారి కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది.
షియా ముస్లింలకు ఇరాన్ పెద్ద దిక్కుగా ఉంది. ఇరాన్ తర్వాత భారత్, పాకిస్తాన్లో షియా జనాభా ఎక్కువగా ఉంది. ఖమేనీ షియా ముస్లింలలో పెద్ద నాయకుడిగా పరిగణింబడుతారు. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు భారత్ ఎలా స్పందిస్తుందనే దానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతానికి భారత్ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఇరాన్-అమెరికా-ఇజ్రాయిల్ సంబంధాలను భారత్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
-
Nepal Floods: నేపాల్ విలయం.. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన 400 మంది గల్లంతు..
-
LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్కే ఎసరు..?
-
King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..