PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బుధవారం సాయంత్రం వెనెజువెలా కరిబియన్ తీరంలో సంభవించిన ఈ జంట భూకంపాల (7.2 మరియు 7.5 తీవ్రత) ధాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయి జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపాల ప్రకంపనలు దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతం వరకు కూడా తెలిసివచ్చాయి. భూకంప తీవ్రతకు గోడలు కూలిపోవడం, నగరాల్లో పెద్ద ఎత్తున ధూళి మేఘాలు కమ్మేయడంతో రాజధాని కరాకస్ సహా పలు నగరాల్లో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఒక శతాబ్ద కాలంలో వెనెజువెలాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇవి ఒకటిగా నిలిచాయి. మోరోన్ నగరానికి పశ్చిమంగా కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభవించాయి.
Also Read
- Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
- 1983 Cricket World Cup: "తరతరాలకు స్ఫూర్తినిచ్చిన విజయం".. ప్రపంచకప్ విజయానికి 43 ఏళ్లు.!
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
- Rohit Sharma-BCCI: రోహిత్ కోసమా.. భారత క్రికెట్ కోసమా?.. సెలెక్టర్లపై మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు!
వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో ఆస్తి నష్టం జరిగిందని ధృవీకరించారు, అయితే మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజధానిలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని మూసివేశామని, దేశవ్యాప్తంగా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దేశంలోని ఆరోగ్య సిబ్బంది అందరూ అత్యవసర విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, ఫాల్కన్ రాష్ట్ర గవర్నర్ విక్టర్ క్లార్క్ అందించిన సమాచారం ప్రకారం.. అక్కడ 32 మంది ఆసుపత్రి పాలయ్యారని, శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
-
Vaibhav Sooryavanshi: సచిన్ లాంటి ప్రతిభ కానీ.. వైభవ్ సూర్యవంశీపై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు!
-
NBK 112 : ముద్దుల మావయ్యకి ధన్యవాదాలు : నారా లోకేష్
-
Dharman : అశ్వత్ మారిముత్తు నాలుగో దర్శకుడు… షాకింగ్ విషయం రివీల్ చేసిన రజినీ
-
Shubman Gill: కోహ్లీకి గాయం.. గిల్కు ప్లస్ పాయింట్.. విరాట్ను వెనక్కి నెట్టేసిన యంగ్ కెప్టెన్!
ట్రెండింగ్
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..