PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: వెనెజువెలాలో సంభవించిన భీకర జంట భూకంపాల పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విపత్తు సృష్టించిన విధ్వంసంపై గురువారం సోషల్ మీడియా వేదికగా (X) స్పందించిన ఆయన.. బాధితులకు, వెనెజువెలా ప్రభుత్వానికి భారతదేశం తరఫున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు అవసరమైన అన్ని రకాల సహాయసహకారాలను అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
బుధవారం సాయంత్రం వెనెజువెలా కరిబియన్ తీరంలో సంభవించిన ఈ జంట భూకంపాల (7.2 మరియు 7.5 తీవ్రత) ధాటికి దేశంలోని పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయి జనం భయాందోళనలకు గురయ్యారు. ఈ భూకంపాల ప్రకంపనలు దాదాపు 1700 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రెజిల్లోని అమెజాన్ ప్రాంతం వరకు కూడా తెలిసివచ్చాయి. భూకంప తీవ్రతకు గోడలు కూలిపోవడం, నగరాల్లో పెద్ద ఎత్తున ధూళి మేఘాలు కమ్మేయడంతో రాజధాని కరాకస్ సహా పలు నగరాల్లో ప్రజలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఒక శతాబ్ద కాలంలో వెనెజువెలాలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇవి ఒకటిగా నిలిచాయి. మోరోన్ నగరానికి పశ్చిమంగా కేవలం ఒక్క నిమిషం వ్యవధిలోనే ఈ రెండు భూకంపాలు సంభవించాయి.
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల్లో ఆస్తి నష్టం జరిగిందని ధృవీకరించారు, అయితే మరణాల సంఖ్యపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. రాజధానిలోని ప్రధాన విమానాశ్రయమైన ‘సిమోన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం’ తీవ్రంగా దెబ్బతినడంతో దాన్ని మూసివేశామని, దేశవ్యాప్తంగా పాఠశాలలకు కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో దేశంలోని ఆరోగ్య సిబ్బంది అందరూ అత్యవసర విధులకు హాజరుకావాలని ఆదేశించారు. కాగా, ఫాల్కన్ రాష్ట్ర గవర్నర్ విక్టర్ క్లార్క్ అందించిన సమాచారం ప్రకారం.. అక్కడ 32 మంది ఆసుపత్రి పాలయ్యారని, శిథిలాల కింద చిక్కుకున్న మరో 15 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?