Israel-Palestine: ఇజ్రాయిల్కి సహకరించిన ముగ్గురిని బహిరంగంగా ఉరితీసిన పాలస్తీనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో హమాస్ దారుణానికి ఒడిగట్టింది. ఇజ్రాయిల్ సైనికులకు సహకరించారనే నెపంతో ముగ్గురు పాలస్తీనా పౌరుల్ని బహిరంగంగా ఉరి తీశారు. ఇజ్రాయిల్కి సహకరించినందుకు వెస్ట్బ్యాంక్ ప్రాంతంలో ఈ హత్యలు జరిగాయి. తుల్కర్మ్లో రెండు మృతదేహాలను విద్యుత్ స్తంభానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తుల్కర్మ్లో హత్యకు గురైన ఇద్దరు వ్యక్తులు హంజా ముబారక్(31), అజం జుబ్రా(29) అని ఇజ్రాయిల్కి చెందిన ఎన్12 వార్తా ఛానెల్ గుర్తించింది. జెనిన్లో మూడో వ్యక్తిని హతమార్చినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. మీరు దేశద్రోహులు, మీరు గూఢాచారులు అంటూ గుంపు నినాదాలు చేస్తుండగా, వీరిని ఉరితీశారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్ ఉగ్రసంస్థలకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడానికి అవసరమైన సమాచారాన్ని ముగ్గురు వ్యక్తుల ఇజ్రాయిల్ సైన్యానికి ఇచ్చారని ఉరితీశారు.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: Barrelakka Special Interview: నన్ను లేపెయ్యాలని చూస్తున్నారు!.. బర్రెలక్కతో స్పెషల్ ఇంటర్వ్యూ
ఇజ్రాయిల్ సైన్యానికి సాయం చేసినందుకు తమకు డబ్బలు అందినట్లు ఓ వ్యక్తి వీడియో రికార్డింగ్లో ఒప్పుకున్నాడు. ఇన్ఫార్మర్లకు, దేశద్రోహికి ఎలాంటి రక్షణ ఉండదని, మా యోధుల హత్యల్లో ఎవరి ప్రమేయమైనా ఉందని రుజువైతే అతడికి వెంటనే మరణశిక్ష విధిస్తామని రెసిస్టెన్స్ సెక్యూరిటీ అనే సంస్థ ఉరిశిక్షల గురించి వ్యాఖ్యానించింది.
అక్టోబర్7న ఇజ్రాయిల్ పై హమాస్ ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. దాదాపుగా 1200 మందిని క్రూరంగా చంపేశారు. మరో 240 మందిని బందీలుగా పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేల మంది పైగా పాలస్తీనియన్లు మరణించారు. తాజాగా ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజుల పాటు ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం జరిగింది. ప్రస్తుతం హమాస్ చెరలో ఉన్న 50 మంది బందీలను విడుదల చేయనుంది. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..