Pakistan: ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న బిలావల్ భుట్టో.. తీవ్ర దుమారం..!
- పాకిస్థాన్ లో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది..
- పాక్ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది: పీపీపీ చీఫ్..
- నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకోవాలి: భుట్టో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ గురించి స్పందించారు. క్వెట్టాలో విలేకరుల సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో పారదర్శకత కొరవడింది.. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు పాకిస్తాన్ చరిత్రలో అతి పెద్ద రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. రాజకీయ ఏకాభిప్రాయం ద్వారా ఎన్నికల్లో రిగ్గింగ్ పునరావృతమయ్యే సమస్యను ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కోరుకోవాలని బిలావల్ భుట్టో సూచించారు.
Read Also: Kalki 2898 AD: రెబల్ స్టార్ ఖాతాలో మరో రికార్డు… కల్కి కలెక్షన్స్ ఎంతంటే ..?
Also Read
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
ఇక, ఎన్నికల సంస్కరణలను సమర్థించడంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పాత్రను కూడా బిలావల్ భుట్టో జర్దారీ గుర్తించారు. ప్రత్యర్థి పార్టీలు లేదా వ్యక్తిగత రాజకీయ నాయకుల నుంచి అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల ట్రిబ్యునల్స్లో కొనసాగుతున్న ఎలక్షన్ మోసాల కేసులను ఎత్తి చూపుతూ.. న్యాయమైన ఎన్నికల పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఆరోగ్య సంరక్షణలో సింధ్ ప్రభుత్వం సాధించిన విజయాలను కూడా బిలావల్ ప్రశంసించారు.
Read Also: AR Rahman : వారి వల్ల ఉద్వేగానికి లోనయ్యాను.. ఏఆర్ రెహమాన్..
అయితే, క్వెట్టాలో కూడా మెరుగైన వైద్యం, సమాన విద్యను అక్కడి నివాసితులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇదే విధమైన జరుగుతుందని పీపీపీ చీఫ్ బిలావల్ భుట్టో అన్నారు. ఇక, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క మేనిఫెస్టోను గుర్తు చేస్తూ.. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB) రద్దుపై పార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.. న్యాబ్ పొలిటికల్ ఇంజినీరింగ్, ప్రతీకార వ్యూహాలు, రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చిందని ఆయన విమర్శించారు. ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య ప్రక్రియలను ప్రతికూలంగా ప్రభావితం చేసిందని బిలావల్ భుట్టో పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!