Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీపై కుట్ర.. విదేశీయుల కిడ్నాప్కు ఐసిస్ స్కెచ్!
- ఛాంపియన్స్ ట్రోఫీపై కుట్ర
- విదేశీయుల కిడ్నాప్కు ఐసిస్ స్కెచ్!
- భద్రతా దళాలకు పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ‘కుట్ర’ జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెహ్రీక్-ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP), ఐఎస్ఐఎస్ (ISIS), బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లుగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలను హెచ్చరించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్రకు తెరతీశాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇండియా.. పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్లను దుబాయ్కు మార్చారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు ఇంజమామ్-ఉల్-హక్, రమీజ్ రాజా, మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాముఖ్యత గురించి వివరించారు. 2009లో జరిగిన దాడి పాకిస్తాన్ క్రికెట్ గమనాన్ని ఎలా మార్చిందో గుర్తు చేశారు. ఈ కారణంగా మాకు 10 సంవత్సరాలు శిక్ష పడిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kurnool Crime: ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం.. యువకులు వెంబడించడంతో పరార్..
ఈ టోర్నమెంట్ను 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2009 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. తదనంతరం ఈ టోర్నమెంట్ నాలుగు సంవత్సరాలకు మార్చబడింది. ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ఎనిమిది జట్లే ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని ఐసీసీ తెలిపింది. ఇక 2008లో పాకిస్తాన్లో జరగాల్సిన షెడ్యూల్ను రద్దు చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.
తాజావార్తలు
-
Chicken and Egg Prices: నాన్వెజ్ ప్రియులకు ధరల షాక్.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!