పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి ‘కుట్ర’ జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెహ్రీక్-ఇ తాలిబన్ పాకిస్తాన్ (TTP), ఐఎస్ఐఎస్ (ISIS), బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లుగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలను హెచ్చరించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్రకు తెరతీశాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
ప్రస్తుతం జరుగుతున్న ఈ టోర్నమెంట్కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇండియా.. పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్లను దుబాయ్కు మార్చారు. ఇటీవల పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజాలు ఇంజమామ్-ఉల్-హక్, రమీజ్ రాజా, మిస్బా-ఉల్-హక్ మాట్లాడుతూ.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రాముఖ్యత గురించి వివరించారు. 2009లో జరిగిన దాడి పాకిస్తాన్ క్రికెట్ గమనాన్ని ఎలా మార్చిందో గుర్తు చేశారు. ఈ కారణంగా మాకు 10 సంవత్సరాలు శిక్ష పడిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Kurnool Crime: ఏటీఎం ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం.. యువకులు వెంబడించడంతో పరార్..
ఈ టోర్నమెంట్ను 2002లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు. 2009 వరకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. తదనంతరం ఈ టోర్నమెంట్ నాలుగు సంవత్సరాలకు మార్చబడింది. ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్ ఎనిమిది జట్లే ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని ఐసీసీ తెలిపింది. ఇక 2008లో పాకిస్తాన్లో జరగాల్సిన షెడ్యూల్ను రద్దు చేసి దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.