Pakistan Crisis: పాక్లో మరింత ముదిరిన సంక్షోభం.. మంత్రులు, ఉద్యోగాల్లో కోత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan To Cut Govt Employees Salaries And Ministers Allowance: ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఆ దేశం కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాక్లో కేవలం మూడంటే మూడు వారాలకు మాత్రమే సరిపడా మాదకద్రవ్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఖర్చులు తగ్గించుకునేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే షరీఫ్ ఇప్పటికే జాతీయ పొదుపు కమిటీ (National Austerity Committee)ని ఏర్పాటు చేశారు. తాజాగా ఆ కమిటీ కొన్ని పరిశీలనలు చేసి.. ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టినట్టు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.
Boyfriend Crime: మరో వ్యక్తితో పెళ్లి.. గొంతు కోసిన ప్రియుడు
Also Read
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించడంతో పాటు మంత్రిత్వ శాఖలు, వాటి సంబంధిత విభాగాల ఖర్చుకు 15 శాతం కోత పెట్టాలని.. ఆ కమిటీ ప్రధాని షరీఫ్కి ప్రతిపాదించినట్టు ఆ మీడియా సంస్థ పేర్కొంది. అంతేకాదు.. మంత్రుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని, సలహాదారుల సంఖ్యను సైతం కుదించాలని ఆ కమిటీ పరిశీలిస్తోంది. ఆపై మిగిలిన వారు స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుందని ఆ కమిటీ తన ప్రతిపాదనలో తెలిజేసినట్టు ఆ వార్తా కథనం పేర్కొంటోంది. ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందాలంటే.. ఈ కోత, వేటు మార్గాలనే అత్యుత్తమమని ఆ కమిటీ ప్రతిపాదించినట్టు సమాచారం. మరి.. పాక్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Akkineni Nagarjuna: ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..?
మరోవైపు.. ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) సహాయం కోసం పాక్ ఎదురుచూస్తోంది. కానీ.. ఆ సంస్థ పెట్టే నిబంధనల్ని పాటించేందుకు మాత్రం పాక్ విముఖత వ్యక్తం చేస్తుంది. గత రెండున్నర నెలల నుంచి ఐఎంఎఫ్, పాక్ మధ్య ఈ పరిస్థితి కొనసాగుతుంది. అటు.. ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు గాను పాక్ ఇప్పటికే కొన్ని పొదుపు చర్యల్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విధిస్తుండటంతో పాటు ప్రభుత్వ అధికారుల పనివేళలను కుదించింది. రాత్రివేళల్లో వేడుకలపై నిషేధం విధించి. మాల్స్, ఫ్యాక్టరీలు కూడా త్వరగా మూసివేయాలని ఆదేశించింది. పాలకుల అవినీతి, కరోనా, ప్రకృతి విపత్తులే ఆ దేశాన్ని గట్టిగా దెబ్బతీశాయి.
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..