Akkineni Nagarjuna: ఎందుకీ మౌనం.. నాగార్జున.. ఇప్పుడైనా మాట్లాడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna: ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా అందరి బుర్రలను తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న అసలు అక్కినేని నాగార్జునకు ఏమైంది.. ఆయనెందుకు మౌనం వహిస్తున్నాడు.. అందరి మైండ్స్ లోనూ ఇదే రన్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ.. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో మాట తూలిన విషయం తెల్సిందే. అక్కినేని తొక్కినేని అనే మాటను అభిమానులే జీర్ణించుకోలేక వారు బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదంపై అక్కినేని వారసులు అఖిల్, చైతన్య కూడా స్పందించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు లాంటివారిని కించపరిస్తే మనల్ని మనమే కించపర్చుకోవడమే అని సున్నితంగా కౌంటర్ వేశారు. ఇక అప్పుడు కూడా నాగ్ ఒక్క మాట అన్నది లేదు.. కనీసం ట్విట్టర్ ద్వారా స్పందించింది లేదు. సరే వేరే పనుల్లో బిజీగా ఉండి ఉంటాడులే అని కొందరు.. బాలయ్య మాటలను పట్టించుకోనవసరం లేదని అనుకోని ఉంటాడని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదం ముదిరి అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని వారసులు వరకు వెళ్ళింది. బాలయ్య.. నేడు ఈ వివాదంపై మాట్లాడుతూ “నాగేశ్వరరావు నన్నే ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునేవారు.. ఎందుకంటే నాగేశ్వరరావు పిల్లల దగ్గర ఆప్యాయత లేదు, నా దగ్గర ఉంది” అని చెప్పుకొచ్చాడు.
నిజం చెప్పాలంటే ముందు అన్న మాటలు కన్నా ఈ మాటలు అక్కినేని కుటుంబాన్ని అవమానించినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఒక తండ్రికి పిల్లలు ఆప్యాయత పంచలేదని, దానికోసం సొంత పిల్లలను వదిలివేరేవారి పిల్లలపై ప్రేమను చూపించారు ఏఎన్నార్ అనే అర్థంలో బాలయ్య మాటలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా అక్కినేని నాగార్జున స్పందించకపోతే అది నిజమే అని అభిమానులు అనుకునే ప్రమాదం ఉంది. అయినా నాగ్ లో మాత్రం చలనం లేదు. ఈ వివాదాన్ని పక్కన పెట్టి నేడు హైదరాబాద్ లో జరిగిన హీరో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు నాగ్ భార్యతో కలిసి వెళ్లడంతో అక్కినేని అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏమయ్యా నాగార్జున.. తండ్రి వివాదం కన్నా పెళ్లి వేడుక ముఖ్యమా..? ఏదో ఒకటి మాట్లాడు.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారైనా నాగ్ నోరు విప్పుతాడో లేదో చూడాలి.
Also Read
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
- Article 370: రెండు జాతీయ అవార్డులు గెలిచిన ‘ఆర్టికల్ 370’.. ఏ ఓటీటీలో చూడొచ్చో తెలుసా?
- Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
- Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!