Pakistan: ;పాక్ సైన్యంపై తాలిబన్ల మెరుపుదాడి.. 16 మంది మృతి..
- పాకిస్తాన్ ఆర్మీపై తాలిబన్ల మెరుపు దాడి..
- 16 మంది పాక్ సైనికుల మృతి..
- ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఘటన..
Pakistan: పాకిస్తాన్ సైన్యంపై పాక్ తాలిబన్లు ఘోరమైన దాడి చేశారు. మొత్తం 16 మంది పాక్ సైనికులను హతమార్చారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆర్మీ ఔట్పోస్టుపై తాలిబన్లు రాత్రిపూట మెరుపు దాడి చేశారు. మొత్తం 30 మంది ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున ఆర్మీ ఔట్ పోస్టు మూడు వైపుల నుంచి రెండు గంటల పాటు దాడి చేశారని పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు. దాడి అనంతరం చెక్ పాయింట్ వద్ద ఉన్న వైర్లెస్ కమ్యూనికేషన్ పరికరాలను, పత్రాలను, ఇతర వస్తువులను తాలిబన్లు తగలబెట్టారు.
Read Also: Sridhar Babu: అల్లు అర్జున్ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్..
Also Read
- Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
- Washington Hilton Gunfire: వైట్ హౌస్ కార్యక్రమంలో కాల్పుల కలకలం.. భయంతో టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.!
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
ఆఫ్ఘన్ సరిహద్దుకు 40 కి.మీ దూరంలో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని మాకీన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. తమ సీనియర్ కమాండర్ల బలిదాలనుకు ప్రతీకారంగా ఈ దాడి జరిపినట్లు తాలిబన్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్ తాలిబన్లు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ ఆర్మీ, పోలీసులు లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు.
ఇస్లామాబాద్లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారం, గత ఏడాది మరణాలు ఆరేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి, 1,500 మందికి పైగా పౌరులు, భద్రతా దళాలు,ఉగ్రవాదులు మరణించారు. పాకిస్తాన్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదుల్ని నిలువరించడంలో ఆఫ్ఘన్ పాలకులు విఫలమయ్యారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!