Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్పై కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan summons US envoy over Joe Biden’s comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
పాకిస్తాన్ లోని అమెరికా రాయబారిని పిలిచింది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్ధారీ దీనిపై మాట్లాడుతూ.. జో బైడెన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. ఇస్లామాబాద్ లోని యూఎస్ రాయబారి డొనాల్డ్ బ్లోమ్ కు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ తన సమగ్రత, భద్రతపై కఠినంగా ఉందని.. ప్రశ్నలు లేవనెత్తాలంటే అవి భారతదేశం అణ్వాయుధాలపై ఉండాలని బిలావల్ బుట్టో అన్నారు. పాకిస్తాన్-అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతోనే అపార్థం చేసుకున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు.
Also Read
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
Read Also: Uttam Kumar Reddy : టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా
గతంలో భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిన విషయాన్ని బుట్టో ప్రస్తావించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ హయాంలో పాకిస్తాన్- అమెరికా సంబంధాలు క్షీణించాయి. అమెరికా ఇచ్చే సైనిక సహాయాన్ని కడా నిలిపివేసింది. అయితే జో బైడెన్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే ఎఫ్-16 విమానాలను ఆధునీకీకరించే ఢిపెన్స్ డీల్ అమెరికా- పాకిస్తాన్ మధ్య కుదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ కాస్త ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!