PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
- పాకిస్తాన్లో పెట్రోల్ ధరల మంటలు..
- పెట్రోల్, నిత్యవసరాల ధరల పెరుగుదలపై ప్రజాగ్రహం..
- జమాతే ఇస్లామీ నేతృత్వంలో ప్రధాన నగరాల్లో నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAKISTAN: అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం చేసి అంతర్జాతీయంగా తనను తాను సూపర్ పవర్గా భావించుకుంటోంది పాకిస్తాన్. కానీ దేశంలో మాత్రం ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే కాకుండా బలూచిస్తాన్, ఖైబర్ ఫక్తుంఖ్వా, పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)ల్లో తిరుగుబాటు ఎదుర్కొంటోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రజాగ్రహం తీవ్ర స్థాయికి చేరుతోంది. పెట్రోలియం లెవీ, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ జమాత్-ఇ-ఇస్లామీ ఆందోళనకు పిలుపునివ్వడంతో వేల సంఖ్యలో ప్రజలు రోడ్ల పైకి వచ్చారు.
కరాచీ, లాహోర్, పెషావర్, క్వెట్టా, ఇస్లామాబాద్, రావల్పిండి, అబోట్టాబాద్ వంటి నగరాల్లో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులతో పాటు, హైవేలపై ఆందోళనలు చేవారు. లెవీని వెనక్కి తీసుకోవాలి, ఎలాంటి లెవీ లేకుండా రూ. 225కే ఇంధనం ఇవ్వాలి అంటూ నినాదాలు చేశారు. జమాత్-ఇ-ఇస్లామీ అధినేత హఫీజ్ నయీముర్ రెహ్మాన్ ప్రభుత్వ పన్ను విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం పెట్రోలియం పై లెవీ ద్వారా రూ. 8 ట్రిలియన్ల పాకిస్తానీ రూపాయలను వసూలు చేసిందని ఆరోపించారు. మరోవైపు, ఐఎంఎఫ్ లెవీని తగ్గించేందుకు అంగీకరించిందని ప్రభుత్వం చెబుతోంది.
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
శుక్రవారం జరిగిన నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమే అని జమాతే ఇస్లామీ వార్నింగ్ ఇచ్చింది. అవసరమైనే ఈ నిరసనల్ని దీర్ఘకాలం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రెహ్మాన్ తెలిపారు. ఇరాన్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఏప్రిల్లో లీటర్ పెట్రోల్ రూ. 459 పాకిస్తానీ రూపాయలకు చేరింది. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ. 157.26. డీజిల్ ధర రూ. 520.35 పాక్ రూపాలయకు చేరింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ యుద్ధం తర్వాత ఇంధన ధరలు అత్యధికంగా పెరిగిన దేశాల్లో పాక్ రెండోస్థానంలో ఉంది.
తాజావార్తలు
-
PAKISTAN: పెట్రోల్ ధరల మంట.. పాకిస్థాన్లో రోడ్డెక్కిన వేలాది మంది
-
IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
-
Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
-
Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!