Pakistan Economic Crisis: ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Economic Crisis: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది పొరుగు దేశం పాకిస్తాన్. ఐఎంఎఫ్ సాయం కోసం ఎదురుచూస్తోంది. 1.1 బిలియన్ డాలర్లను ఐఎంఎఫ్ ఇస్తేనే ప్రస్తుతం పాకిస్తాన్ బతికిబట్టకడుతుంది. అయితే ఐఎంఎఫ్ పెట్టిన షరతులు కఠినంగా ఉన్నా కూడా పాక్ సర్కార్ అంగీకరించాల్సి వస్తోందని సాక్షాత్తు పాక్ ప్రధాని షెహజాబ్ షరీఫ్ అన్నారు. ఈ షరతుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇబ్బడిముబ్బడిగా పన్నులు పెంచుతోంది. ఇప్పటికే ధరలు పెరిగి కష్టాల్లో ఉన్న పాక్ ప్రజలు మరింత కష్టాల్లోకి నెట్టేయబడుతున్నారు.
Read Also: Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?
Also Read
- Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
- North Korea: ఫుట్బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ తన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలిచ్చే పరిస్థితిలో లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం కారణంగా నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం జీతాలతో సహా బిల్లుల క్లియరింగ్ను నిలిపివేయాలని అకౌంటెంట్ జనరల్ను ఆదేశించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలు అన్ని బిల్లుల క్లియరింగ్ ను నిలిపివేయాలని ఆర్థిక, రెవెన్యూ మంత్రిత్వశాఖ అకౌంటెంట్ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ రెవిన్యూస్ ను ఆదేశించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రక్షణ సంబంధిత సంస్థల జీతాలు, పెన్షన్లు వచ్చే నెలలకు సంబంధించించి ఇప్పటికే క్లియర్ చేయబడ్డాయి.
ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఫిబ్రవరి 20న అక్కడి పార్లమెంట్ మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కార్లు, గృహెపకరణాలు, చాక్లెట్లు, సౌందర్య సాధనాల దిగుమతిపై 17 నుంచి 25 శాతం అమ్మకపు పన్నును పెంచింది. సాధారణ విక్రయపన్నును 17 నుంచి 18 శాతానికి పెంచింది. విద్యుత్, పెట్రోలియం, గ్యాస్ ధరలు పెరగడం వల్ల అక్కడ ద్రవ్యోల్భణం మరింతగా తీవ్రం అవుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ ప్రభుత్వం గ్యాస్ ఛార్జీలను రూ. 147.57 నుంచి రూ. 295కు పెంచింది. అక్కడి ప్రజలు నిత్యావసరాల రేట్లు పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Neem Juice Daily : వేప రసం మంచిదే.. కానీ రోజూ తాగితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
-
Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
-
West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
-
Donga Police: ఒకడేమో పోలీస్.. మరొకడు పోలీస్ అవతారమెత్తాడు.. సీన్ కట్ చేస్తే..!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!