Pakistan: “పార్లమెంట్ నడపడానికి కూడా అప్పు తీసుకుంటున్నాం”.. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని చెప్పిన కొత్త ప్రధాని..
Pakistan: తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని వివరించారు కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్. జాతీయ అసెంబ్లీని నడిపేందుకు అప్పులు తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చి 2030 నాటికి జీ-20 సభ్యత్వాన్ని సాధించేలా చేస్తానని ప్రమాణం చేశారు.
పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్(PML-N), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి షెహజాబ్ షరీఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రోజు 336 మంది సభ్యులు ఉన్న పార్లమెంట్లో 201 ఓట్లను పొంది రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశ 24వ ప్రధానిగా ఆయన ప్రసంగం చేస్తూ పాకిస్తాన్ పరిస్థితులను వివరించారు. మేము విధిని మార్చాలని అనుకుంటున్నామని, ఈ సవాళ్లను ఓడించి పాకిస్తాన్ని సరైన స్థితిలోకి తీసుకెళ్తామని, ఈ పని కష్టమైనప్పటికీ అసాధ్యం కాదని అన్నారు. పాకిస్తాన్ని అప్పుల ఊబి నుంచి నవాజ్ షరీఫ్, ఆసిఫ్ అలీ జర్దారీ సహకారం తీసుకుంటామన్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- Putin - Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్కు రష్యా 'ఫుల్' సపోర్ట్..!
- Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
Read Also: BJP: ముగిసిన బీజేపీ కీలక సమావేశాలు.. వారం రోజుల్లోగా పొత్తులపై క్లారిటీ!
వ్యాపార కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రణాళికపై, క్రూరమైన వాడుకలో లేని చట్టాలను నిబంధనలనను రద్దు చేస్తామని అన్నారు. ఎక్స్పోర్ట్ జోన్ల నెట్వర్క్ ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. 2030 నాటికి జీ-20లో సభ్యత్వం పొందడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దేశం లక్ష కోట్ల రూపాయల కన్నా ఎక్కువ బడ్జెట్ లోటును కలిగి ఉందని, అలాంటి సమయంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లు షెహబాజ్ చెప్పుకొచ్చారు. జీ-20 ఆర్థికం అభివృద్ధి చెందిన, చెందుతున్న ఒక గ్రూప్, ఇందులో భారత్ కూడా సభ్యుడిగా ఉంది.
విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలకు దేశం చెల్లించాల్సిన అప్పులు పేరుకుపోయాయని, ఈ కారణంగా ఇంధన రంగం కుదేలైందని షరీఫ్ అన్నారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పీఐఏ) వంటి ప్రభుత్వ యాజమాన్యాలు బిలియన్ల రూపాయల నష్టాల్లో నడుస్తున్నాయని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నుముఖ అని, రైతులకు రాయితీ అందిస్తామని చెప్పారు. విత్తన మాఫియాను అంతమొందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!