అగ్ర దేశం అమెరికా, దక్షిణ కొరియాకు పక్కలో బళ్లెంలా ఉత్తర కొరియా తయారైంది. వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ ఇరు దేశాలకు గట్టి హెచ్చరికలను జారీ చేస్తున్నది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్ నిర్వహిస్తుండటంతో.. తామూ తగ్గేది లేదని కిమ్ జొంగ్ కింగ్డమ్ స్పష్టం చేస్తున్నది. ఇవాళ ఉదయం తూర్పూ తీరంలోని సముద్ర జలాల వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది.
Also Read : AP Crime: భార్యపై బీరుసీసాతో దాడి..
ఇవాళ ( సోమవారం ) ఉదయం 7.74 గంటల ప్రాంతంలో ఉత్తర వాంఘే ప్రావిన్స్ లో జుంగ్వాలో రెండు స్పల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడాన్ని తామ సైన్యం గుర్తించిందని దక్షిణ కొరియా జాయింట్స్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించింది. అవి తూర్పు తీరంలోని సముద్ర జలాలవైపు ప్రయాణించాయని తెలిపారు. వాటిని జపాన్ సముద్రంగా కూడా పిలుస్తారు. దీంతో ఈ నెలలో ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య ఏడుకు చేరింది. గతేడాది 70 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించడం విశేశం.
Also Read : Human sacrifice : 10 ఏళ్ల బాలుడి నరబలి.. యూపీలో ఘటన
దక్షిణ కొరియాతో కలిసి అమెరికా సైనిక కసరత్తులు చేసిన నేపథ్యంలో వరుసగా క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగిస్తూ వస్తున్నది. ఇరు దేశాలు నిర్వహిస్తున్న సైనిక కసరత్తులను తమ దేశంపై దండయాత్రకు రిహార్సల్స్ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఆరోపించాడు. తాము హెచ్చరించన దక్షిణ కొరియా, అమెరికా పట్టించుకోలేదని ఆయన స్పష్టం చేశాడు. అందులో భాగంగానే ఈ క్షిపణుల ప్రయోగాలు జరుగుతున్నాయని ఉత్తర కొరియా వెల్లడించింది.