Venezuela: నికోలస్ మదురో.. డెల్సీ రోడ్రిగ్జ్ ఇద్దరూ సాయిబాబా భక్తులే.. ఫొటోలు వైరల్
- సోషల్ మీడియాలో ట్రెండింగ్లో మదురో ఫొటోలు
- పుట్టపర్తి సాయిబాబాతో ఉన్న ఫొటోలు వైరల్
- నికోలస్ మదురో.. డెల్సీ రోడ్రిగ్జ్ ఇద్దరూ సాయిబాబా భక్తులే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులాపై అమెరికా సైన్యం దాడి తర్వాత ఎక్కువగా మార్మోగుతున్న పేరు నికోలస్ మదురో. శనివారం తెల్లవారుజామున అధ్యక్ష భవనంపై యూఎస్ దళాలు మెరుపు దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురో.. అతని భార్య సిలియా ఫ్లోర్స్ను కిడ్నాప్ చేసి అమెరికాకు తరలించారు. అనంతరం వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

Also Read
తాజాగా నికోలస్ మదురో భారతదేశం పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నికోలస్ మదురో.. భార్య సిలియా ఫ్లోర్స్, తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ముగ్గురూ కూడా పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తులుగా తెలుస్తోంది. యువకుడిగా ఉన్న సమయంలో పలుమార్లు నికోలస్ మదురో పుట్టపర్తి వచ్చారు. సాయిబాబాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అలాగే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్ కూడా ఇప్పటికే పలుమార్లు పుట్టపర్తిని సందర్శించారు. ఈమె కూడా సాయిబాబాను ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి నికోలస్ మదురో కేథలిక్ వాతావరణంలో పెరిగారు. అయితే సిలియా ఫ్లోర్స్ను మదురో వివాహం చేసుకోకముందు పుట్టపర్తి సత్యసాయి బాబాను పరిచయం చేశారు. దీంతో సాయిబాబా భక్తుడిగా మారిపోయారు. 2005లో సాయిబాబాను కలిసేందుకు సిలియా ఫ్లోర్స్తో కలిసి మదురో పుట్టపర్తి వచ్చారు. ఏపీలోని పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని సందర్శించి గడిపారు. ఆ సమయంలో నికోలస్ మదురో చాలా యువకుడిగా ఉన్నారు. ఫ్లోర్పై కింద కూర్చుని సాయిబాబా పాదాల దగ్గర కూర్చున్నారు.

ఇక నికోలస్ మదురో అధికారంలోకి వచ్చాక. మిరాఫ్లోర్స్ ప్యాలెస్లోని ప్రైవేటు కార్యాలయం గోడలపై సైమన్ బొలివర్, హ్యూగో చావెజ్లతో పాటు సాయిబాబా చిత్ర పటాలు కూడా ఉన్నాయి. ప్రముఖంగా గోడలపై ఇప్పటికీ సాయిబాబా ఫొటోలనే ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి.

ఇక 2011లో సాయిబాబా మరణించిన తర్వాత వెనిజులా విదేశాంగ మంత్రిగా ఉన్న మదురో.. సభలో సాయిబాబాకు అధికారికంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టాలని తీవ్ర ఒత్తిడి చేశారు. మదురో ఆధ్వర్యంలో వెనిజులా జాతీయ అసెంబ్లీలో అధికారికంగా సాయిబాబాకు సంతాప తీర్మానాన్ని ఆమోదించింది. అధికారికంగా గుర్తించడానికి జాతీయ సంతాప దినాన్ని కూడా ప్రకటించింది. అంతేకాదు.. ఇప్పటికీ వెనిజులాలో అనేక మంది సాయిబాబా భక్తులు ఉండడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే.. 2024లో వెనిజులా ప్రభుత్వం జాతీయ దినోత్సవ వేడుకలకు ‘‘ఓం’’ చిహ్నాన్ని ముద్రించి ఆహ్వానాలు పలికారు. అంతేకాదు.. సాయిబాబా శతజయంతిని పురస్కరించుకుని రాజకీయ సందేశాలు పంపుతూ ఒక ప్రకటనలో ‘‘సాయిబాబా వెలుగు జీవి’’ గా అభివర్ణించారు.

Recently, the Venezuelan government sent out invitations for its National Day Celebrations featuring a 🕉️, leaving many puzzled.
Few know that Venezuelan President Nicolás Maduro has been a Satya Sai Baba devotee for decades. Unfortunately, many Hindus are unaware of this and… pic.twitter.com/nwIv9Nv3U4
— Arun Pudur (@arunpudur) July 6, 2024
తాజావార్తలు
-
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
-
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?