Artemis-2: చంద్రుడిపైకి వెళ్లే వారి పేర్లను వెల్లడించనున్న నాసా.. 50 ఏళ్ల తరువాత ఇప్పుడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Artemis-2: దాదాపుగా 50 ఏళ్ల క్రితం మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు. ఆ తరువాత ఏ అంతరిక్ష సంస్థ కూడా చంద్రుడి పైకి వెళ్లేందుకు సాహసించలేదు. ఎందుకంటే అంతటి క్లిష్టతతో కూడిన అంతరిక్ష ప్రయాణం కాబట్టే నాసాతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రష్యా అంతరిక్ష సంస్థలు చంద్రుడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే నాసా మాత్రం 2024లో ఆర్టెమిస్ -2 ద్వారా మానవుడిని మరోసారి చంద్రుడిపైకి పంపాలని ప్రణాళిక సిద్ధం చేసింది. నలుగురు వ్యోమగాములను చంద్రుడి పైకి పంపనుంది.
Read Also: CM KCR : రేపు కవితను అరెస్ట్ చేయొచ్చు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీని లేకుండా చేద్దాం
Also Read
- Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
చంద్రుడిపైకి వెళ్లి తిరిగి వచ్చేలా రూపొందించిన ఆర్టిమిస్-1 ప్రయోగాన్ని గతేడాది నాసా నిర్వహించి విజయం సాధించింది. నాసా రెండో ప్రయత్నంగా ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను పంపనుంది. అయితే ఈ సారి చంద్రుడి ఉపరితలం చుట్టూ ఉన్న కక్ష్యలోకి వ్యోమగాములను పంపాలని యోచిస్తోంది. ఈ ప్రయోగంలో పాల్గొనే వ్యోమగాముల పేర్లను ఏప్రిల్ 3న నాసా వెల్లడించనుంది. మొత్తం నలుగురు వ్యోమగాముల్లో ముగ్గురు అమెరికాకు చెందని వారు కాగా.. ఒకరు కెనడా దేశస్తుడు. 50 ఏళ్ల క్రితం చివరిసారిగా అపోలో మిషన్ ద్వారా మానవుడు చంద్రుడిపైకి వెళ్లాడు.
ఆర్టెమిస్-2 మొత్తం 10 రోజుల మిషన్. 2024లో నలుగురు వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లాలన్నది, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలన్నది నాసా ప్లాన్. ఇది విజయవంతం అయిన తర్వాత ఆర్టిమిస్ -3 ద్వారా వ్యోమగాములు చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రయోగానికి మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం నాసా ఆర్టెమిస్ -1 మిషన్ హార్డ్వేర్ను అప్గ్రేడ్ చేస్తోంది. ఆర్టెమిస్ లో భాగంగా ఉండే ఓరియన్ స్పేస్క్రాఫ్ట్లోని హీట్ షీల్డ్ పునర్నిర్మాణం జరుగుతోంది. ఇది రీఎంట్రీ సమయంలో కొంత డ్యామేజ్ అయింది. వ్యోమగాముల భద్రతకు హీట్ షీల్డ్ చాలా కీలకం. రీఎంట్రీ సమయంలో భూమి వాతావరణ ఘర్షణ ఫలితంగా ఏకంగా 5000 డిగ్రీల ఫారెన్ హీట్ వేడి ఉంటుంది. దీన్ని తట్టుకునేందుకు హీట్ షీల్డ్ చాలా కీలకం.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!