Sheikh Hasina: నెలల ముందు షేక్ హసీనా అంచనా..‘‘తెల్లవారి’’ కుట్ర నిజమైందా..?
- షేక్ హసీనా అంచనానే నిజమైందా..?
- ‘‘తెల్లవారి’’ కుట్రతోనే పదవి పోయిందా..
- నెలల క్రితమే హసీనా కీలక వ్యాఖ్యలు..
Sheikh Hasina: ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని దించేందుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు కొన్ని నెలలకే నిజమయ్యాయి. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు. తన తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న షేక్ ముజిబుర్ రెహమాన్లా తనను హత్య చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్లోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ‘‘క్రైస్తవ దేశం’’ ఏర్పాటుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
Read Also: Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..
Also Read
- Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
- Zohran Mamdani-King Charles: కోహినూర్ వజ్రం భారత్కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్కు మమ్దానీ విజ్ఞప్తి!
- Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
- Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా మరోసారి భారీ విజయం సాధించారు. ప్రతిపక్ష, ఖలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఈ ఎన్నికల్ని బహిష్కరించింది. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు ఒక విదేశాన్ని తాను అనుమతించకపోవడంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు. ఆ దేశాన్ని అనుమతించినట్లైతే తనకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. చాలా మంది విదేశీయులు బంగ్లాదేశ్పై దృష్టి పెట్టారని, బంగాళాఖాతంలో (ఛటోగ్రామ్), మయన్మార్లోని కొన్ని ప్రాంతాలతో తూర్పు తైమూర్ లాగా కొత్త క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తారని ఆమె అన్నారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలవంచబోనని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఆమె పదవి కోల్పోవడానికి కారణమైంది. విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, అవి కాస్త హింసాత్మక ఘటనలకు కారణం కావడంతో 300 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరోసారి హింస చెలరేగడంతో, ఆ దేశ ఆర్మీ చీఫ్ షేక్ హసీనాకు 45 నిమిషాల అల్టిమేటం జారీ చేయడంతో ఆమె పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చేంసింది. ఇక్కడ నుంచి లండన్ వెళ్లి ఆశ్రయం పొందాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
-
Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
-
Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
-
Freezer Ice Smell Solution: ఫ్రీజర్లోని ఐస్ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?