Sheikh Hasina: నెలల ముందు షేక్ హసీనా అంచనా..‘‘తెల్లవారి’’ కుట్ర నిజమైందా..?
- షేక్ హసీనా అంచనానే నిజమైందా..?
- ‘‘తెల్లవారి’’ కుట్రతోనే పదవి పోయిందా..
- నెలల క్రితమే హసీనా కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని దించేందుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు కొన్ని నెలలకే నిజమయ్యాయి. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని వదిలి పారిపోయేలా చేశారు. తన తండ్రి, బంగ్లా జాతిపితగా పేరున్న షేక్ ముజిబుర్ రెహమాన్లా తనను హత్య చేయవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్, మయన్మార్లోని కొన్ని ప్రాంతాలను కలిపి కొత్తగా ‘‘క్రైస్తవ దేశం’’ ఏర్పాటుకు ‘‘శ్వేత జాతీయులు’’ కుట్ర పన్నారని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
Read Also: Bangladesh: షేక్ హసీనాపై యూకే వేదికగా పాక్, చైనా కుట్ర.. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్..
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
జనవరిలో జరిగిన ఎన్నికల్లో షేక్ హసీనా మరోసారి భారీ విజయం సాధించారు. ప్రతిపక్ష, ఖలిదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఈ ఎన్నికల్ని బహిష్కరించింది. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు ఒక విదేశాన్ని తాను అనుమతించకపోవడంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆమె అన్నారు. ఆ దేశాన్ని అనుమతించినట్లైతే తనకు ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పారు. చాలా మంది విదేశీయులు బంగ్లాదేశ్పై దృష్టి పెట్టారని, బంగాళాఖాతంలో (ఛటోగ్రామ్), మయన్మార్లోని కొన్ని ప్రాంతాలతో తూర్పు తైమూర్ లాగా కొత్త క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేస్తారని ఆమె అన్నారు. తాను ఎవరి ఒత్తిళ్లకు తలవంచబోనని చెప్పారు.
స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పించాలని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం ఆమె పదవి కోల్పోవడానికి కారణమైంది. విద్యార్థులు దీనికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, అవి కాస్త హింసాత్మక ఘటనలకు కారణం కావడంతో 300 మంది మరణించారు. తాజాగా ఆదివారం మరోసారి హింస చెలరేగడంతో, ఆ దేశ ఆర్మీ చీఫ్ షేక్ హసీనాకు 45 నిమిషాల అల్టిమేటం జారీ చేయడంతో ఆమె పదవికి రాజీనామా చేసి, భారత్ వచ్చేంసింది. ఇక్కడ నుంచి లండన్ వెళ్లి ఆశ్రయం పొందాలని అనుకుంటోంది.
తాజావార్తలు
-
Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!
-
Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్
-
Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..
-
Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..
-
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!