Israel-Hamas: కాల్పుల విరమణ గడువుకు కొన్ని నిమిషాల ముందు.. సంధి ఒప్పందం పొడగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas: ఇజ్రాయిల్-హమాస్ మధ్య 50 రోజలు యుద్ధం తర్వాత ప్రస్తుత కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇరు పక్షాల కూడా బందీలను, ఖైదీలను మార్చుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయంతో సంధి ముగిసేందుకు కొన్ని నిమిషాల ముందు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడగిస్తున్నట్లు, సంధి కాలాన్ని పెంచినట్లు ఇరు పక్షాలు ప్రకటించాయి. ఖతార్ వేదికగా ఈ ప్రకటన వెలువడింది. ఇజ్రాయిల్ సైన్యం సంధిని పొడగిస్తు్న్నట్లు తెలిపింది.
బందీలను విడుదల చేసే ప్రక్రియ కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాల నేపథ్యంలో నిబంధనలకు లోబడి కార్యాచరణ విరామం కొనసాగుతుందని ఇజ్రాయిల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయిల్ ప్రధాని కార్యాలయం కూడా పొడగింపును ధృవీకరించింది. బందీలుగా ఉన్న వారి కొత్త జాబితాను విడుదల చేసింది. గత శుక్రవారం ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి ఒప్పందం కుదిరింది. ముందుగా నాలుగు రోజులు అనుకున్నప్పటికీ మరో రెండు రోజులు పొడగించారు. ప్రస్తుతం మరోసారి సంధిని పొడగించారు.
Also Read
- Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
- Imran Khan PTI: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంచలన నిర్ణయం
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ఇదిలా ఉంటే అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయిల్ చేరుకున్న కొన్ని గంటల తర్వాత విరామం పొడగింపు ప్రకటన వెలువడింది. అంతకుముందు ఖతార్ ప్రధానితో యూఎస్ సీఐఏ, ఇజ్రాయిల్ మొసాద్ అధికారులు భేటీ అయి సంధి పొడగింపు గురించి చర్చించారు. దీనికి ముందు ఖతార్ కూడా హమాస్ నేతలతో చర్చలు జరిపింది.
అక్టోబర్7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేశారు. 1200 మంది హతమార్చారు. మరో 240 మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్పై భీకరదాడి చేస్తోంది. ఈ దాడుల్లో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇందులో 40 శాతం మంది పిల్లలు ఉండటంపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాల్పుల విమరణ కోసం ఇజ్రాయిల్పై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాలు సంధి ఒప్పందానికి అంగీకరించాయి.
తాజావార్తలు
-
Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
-
EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
-
Jupally Krishna Rao: “లెక్క తప్పు ఐతే రాజీనామా చేస్తా”.. కేసీఆర్, కేటీఆర్లకు మంత్రి జూపల్లి సవాల్!
-
Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
-
Akhil Akkineni : సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!