Maldives: భారత శరణు కోరుతున్న మాల్దీవులు.. మారిన ప్రెసిడెంట్ ముయిజ్జూ స్వరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులకు విషయం బోధపడినట్లుంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం, చైనా అండ చూసుకుని భారత వ్యతిరేక ధోరణిని ప్రదర్శించింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ ముయిజ్జూ ‘ఇండియా ఔట్’ నినాదంతో అధికారంలోకి వచ్చాడు. ప్రెసిడెంట్గా ఎన్నిక కావడంతోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదే కాకుండా చైనాతో సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాడు. మే 10 నాటికి తమదేశంలోని ఉన్న ప్రతీ భారతీయ సైనికుడు వెళ్లిపోవాలని డిమాండ్ చేశాడు.
ఇదిలా ఉంటే ముయిజ్జూ స్వరంలో మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు భారత్ అంటేనే ఎగిరెగిరి పడిన అతను, ఇప్పుడు భారత అనుకూల వ్యాఖ్యలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. రుణాల ఉబిలో చిక్కుకున్న ఈ ద్వీప దేశం.. రుణ విముక్తి కోసం భారత్ తమ దేశానికి ‘‘సన్నిహిత మిత్రదేశం’’గా కొనసాగుతుందని ముయిజ్జూ వ్యాఖ్యానించాడు. గతేడాది చివరినాటికి మాల్దీవులు భారత్కి దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయి పడింది.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
- Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
Read Also: Harish Rao : బీజేపీకి బీ టీమ్ లీడర్గా రేవంత్ రెడ్డి తీరు
గురువారం, అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మాల్దీవులకు సాయం చేయడానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందని, భారత్ అత్యధిక సంఖ్యలో ప్రాజెక్టులను అమలు చేసిందని ముయిజ్జూ అన్నారు. భారతదేశం సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతుందని, దానిలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఈ నెలలో భారత సైనిక సిబ్బంది మొదటి బ్యాచ్ మాల్దీవులను వదిలి వెళ్లిన తర్వాత భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఈ వ్యాఖ్యలు వచ్చాయి. మే 10 నాటికి మూడు విమానయాన ప్లాట్ఫారమ్స్ నిర్వహిస్తున్న మొత్తం 88 మంది సైనిక సిబ్బంది దేశం వదిలి వెళ్లాలని ముయిజ్జూ కోరాడు. వీటితో భారత్ అక్కడి ప్రజలకు మానవతా సాయం అందిస్తోంది.
ప్రభుత్వాలు తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్దీవులకు రుణ ఉపశమన చర్యలను కల్పించాలని ప్రస్తుత ప్రెసిడెంట్ భారత్ని కోరారు. భారత్ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపు నిర్మాణంలో మినహాయింపులను అన్వేషించడానికి చర్చలు జరుపుతున్నట్లు ముయిజ్జూ వెల్లడించారు. కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిపివేయడానికి బదులుగా, వాటిని వేగవంతం చేయడానికి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు కనిపించలేదని చెప్పాడు.
మాల్దీవుల్లో ఏప్రిల్ నెలలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో భారత్ పట్ల సామరస్యపూర్వక వ్యాఖ్యలు చేశారు. రుణాల చెల్లింపులో ఉపశమన చర్యలను భారత్ సులభతరం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత మాల్దీవుల పాలకుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎగ్జిమ్ బ్యాంక్) నుండి 1.4 మిలియన్ డాలర్లను రుణంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే, భారతదేశంతో సంబంధాలు బలహీనపడిన తర్వాత ముయిజ్జూ జనవరి నెలలో బీజింగ్ పర్యటనకు వెళ్లారు. చైనా-మాల్దీవుల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి. చైనా పర్యటకులను పంపుతామని చెప్పడంతో పాటు, 130 మిలియన్ డాలర్ల గ్రాంట్ని కూడా ప్రకటించింది.
తాజావార్తలు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
-
STORY Board : తెలుగు సినీ పరిశ్రమ సంక్షోభంలో..!
-
Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
-
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?