Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
- వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ
- నోబెల్ శాంతి గ్రహీత మచాడో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు. గాంధీ ప్రేరణతో రెండు దశాబ్దాలుగా వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడినట్లు చెప్పారు.
‘‘శాంతియుతంగా ఉండటం బలహీనత కాదు. మహాత్మా గాంధీ మానవాళికి దాని అర్థం ఏమిటో చూపించారు. కచ్చితంగా శాంతిని పొందాలంటే మీకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను పొందాలంటే మీకు బలం అవసరం. నైతిక, ఆధ్యాత్మిక శారీరక బలం’’. అని అన్నారు.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా ప్రపంచంలోనే అత్యంత సంఘటిత సమాజాల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాలకు భారతదేశం ఉదాహరణ అని ప్రశంసించారు. భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా చూస్తానని చెప్పారు. అందుకే ‘‘భారతదేశాన్ని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను.’’ అని మచాడో అన్నారు. ‘‘నా కుమార్తె రెండు నెలల క్రితం భారత్కు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ భారతదేశానికి వెళ్లలేదు. నా కుమార్తె భారతదేశాన్ని ప్రేమిస్తుంది. నాకు అక్కడ నివసించే చాలా మంది వెనిజులా స్నేహితులు ఉన్నారు. అయితే నేను భారత రాజకీయాలను అనుసరిస్తాను. ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని మచాడో అన్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరోస్కు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. దీంతో మచాడోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు మచాడో చాలా కాలంగా ‘‘బుల్లెట్లపై బ్యాలెట్లు’’ కోసం పోరాడుతోంది. వ్యక్తిగత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం నిలబడి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
-
GPS, 5ATM వాటర్ రెసిస్టెన్స్, 110+ పైగా స్పోర్ట్స్ మోడ్లతో Realme Watch S5 ఎంట్రీ.!
-
Natural Hair Tonic : పలుచటి జుట్టుకు గుడ్బై.. ఇంట్లోనే తయారయ్యే మ్యాజికల్ హెయిర్ టానిక్.!
-
Cabbage Egg Sandwich : కొరియన్ స్ట్రీట్ స్టైల్ ‘క్యాబేజీ ఎగ్ శాండ్విచ్’.. 5 నిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్ కోసం సూపర్ రెసిపీ.!
-
Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!