Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
- వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ
- నోబెల్ శాంతి గ్రహీత మచాడో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు. గాంధీ ప్రేరణతో రెండు దశాబ్దాలుగా వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడినట్లు చెప్పారు.
‘‘శాంతియుతంగా ఉండటం బలహీనత కాదు. మహాత్మా గాంధీ మానవాళికి దాని అర్థం ఏమిటో చూపించారు. కచ్చితంగా శాంతిని పొందాలంటే మీకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను పొందాలంటే మీకు బలం అవసరం. నైతిక, ఆధ్యాత్మిక శారీరక బలం’’. అని అన్నారు.
Also Read
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా ప్రపంచంలోనే అత్యంత సంఘటిత సమాజాల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాలకు భారతదేశం ఉదాహరణ అని ప్రశంసించారు. భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా చూస్తానని చెప్పారు. అందుకే ‘‘భారతదేశాన్ని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను.’’ అని మచాడో అన్నారు. ‘‘నా కుమార్తె రెండు నెలల క్రితం భారత్కు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ భారతదేశానికి వెళ్లలేదు. నా కుమార్తె భారతదేశాన్ని ప్రేమిస్తుంది. నాకు అక్కడ నివసించే చాలా మంది వెనిజులా స్నేహితులు ఉన్నారు. అయితే నేను భారత రాజకీయాలను అనుసరిస్తాను. ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని మచాడో అన్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరోస్కు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. దీంతో మచాడోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు మచాడో చాలా కాలంగా ‘‘బుల్లెట్లపై బ్యాలెట్లు’’ కోసం పోరాడుతోంది. వ్యక్తిగత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం నిలబడి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!