Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
- వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ
- నోబెల్ శాంతి గ్రహీత మచాడో వెల్లడి
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు. గాంధీ ప్రేరణతో రెండు దశాబ్దాలుగా వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడినట్లు చెప్పారు.
‘‘శాంతియుతంగా ఉండటం బలహీనత కాదు. మహాత్మా గాంధీ మానవాళికి దాని అర్థం ఏమిటో చూపించారు. కచ్చితంగా శాంతిని పొందాలంటే మీకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను పొందాలంటే మీకు బలం అవసరం. నైతిక, ఆధ్యాత్మిక శారీరక బలం’’. అని అన్నారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా ప్రపంచంలోనే అత్యంత సంఘటిత సమాజాల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాలకు భారతదేశం ఉదాహరణ అని ప్రశంసించారు. భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా చూస్తానని చెప్పారు. అందుకే ‘‘భారతదేశాన్ని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను.’’ అని మచాడో అన్నారు. ‘‘నా కుమార్తె రెండు నెలల క్రితం భారత్కు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ భారతదేశానికి వెళ్లలేదు. నా కుమార్తె భారతదేశాన్ని ప్రేమిస్తుంది. నాకు అక్కడ నివసించే చాలా మంది వెనిజులా స్నేహితులు ఉన్నారు. అయితే నేను భారత రాజకీయాలను అనుసరిస్తాను. ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని మచాడో అన్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరోస్కు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. దీంతో మచాడోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు మచాడో చాలా కాలంగా ‘‘బుల్లెట్లపై బ్యాలెట్లు’’ కోసం పోరాడుతోంది. వ్యక్తిగత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం నిలబడి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!