Machado: వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ.. నోబెల్ గ్రహీత మచాడో వెల్లడి
- వెనిజులా ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ
- నోబెల్ శాంతి గ్రహీత మచాడో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమానికి మహాత్మాగాంధీనే ప్రేరణ అని 2025 నోబెల్ శాంతి గ్రహీత మరియా కొరినా మచాడో అన్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘‘శాంతి అంటే బలహీనత కాదు.. మహాత్మా గాంధీ మానవత్వం అంటే ఏమిటో చూపించారు.’’ అని మచాడో అన్నారు. గాంధీ ప్రేరణతో రెండు దశాబ్దాలుగా వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడినట్లు చెప్పారు.
‘‘శాంతియుతంగా ఉండటం బలహీనత కాదు. మహాత్మా గాంధీ మానవాళికి దాని అర్థం ఏమిటో చూపించారు. కచ్చితంగా శాంతిని పొందాలంటే మీకు స్వేచ్ఛ అవసరం. స్వేచ్ఛను పొందాలంటే మీకు బలం అవసరం. నైతిక, ఆధ్యాత్మిక శారీరక బలం’’. అని అన్నారు.
Also Read
- Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్రైట్ సిటిజన్షిప్పై మరోసారి సంచలన నిర్ణయం
- Donald Trump: 'మీరు వైట్ హౌస్ యజమాని కాదు'.. ట్రంప్కు అమెరికా కోర్టు బిగ్ షాక్..
- Doctors Continue Surgery: హ్యాట్సాఫ్.. భూకంపం వణికించినా.. పేషెంట్ ప్రాణాల కోసం కదలని వైద్యులు! వీడియో వైరల్..
ఇది కూడా చదవండి: Gold Rates: మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెనిజులా ప్రపంచంలోనే అత్యంత సంఘటిత సమాజాల్లో ఒకటి అని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని గొప్ప ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించారు. ఇతర దేశాలకు భారతదేశం ఉదాహరణ అని ప్రశంసించారు. భారతదేశాన్ని గొప్ప మిత్రదేశంగా చూస్తానని చెప్పారు. అందుకే ‘‘భారతదేశాన్ని నా హృదయపూర్వకంగా ఆరాధిస్తాను.’’ అని మచాడో అన్నారు. ‘‘నా కుమార్తె రెండు నెలల క్రితం భారత్కు వచ్చింది. కానీ నేను ఎప్పుడూ భారతదేశానికి వెళ్లలేదు. నా కుమార్తె భారతదేశాన్ని ప్రేమిస్తుంది. నాకు అక్కడ నివసించే చాలా మంది వెనిజులా స్నేహితులు ఉన్నారు. అయితే నేను భారత రాజకీయాలను అనుసరిస్తాను. ప్రధాన మంత్రి మోడీతో మాట్లాడే అవకాశం నాకు లభిస్తుందని ఆశిస్తున్నాను.’’ అని మచాడో అన్నారు.
ఇది కూడా చదవండి: UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మోరోస్కు వ్యతిరేకంగా మచాడో పోరాటం చేస్తున్నారు. దీంతో మచాడోకు నార్వేజియన్ నోబెల్ కమిటీ.. 2025 నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసింది. ప్రతిపక్ష నాయకురాలు మచాడో చాలా కాలంగా ‘‘బుల్లెట్లపై బ్యాలెట్లు’’ కోసం పోరాడుతోంది. వ్యక్తిగత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాస్వామ్య సంస్కరణల కోసం నిలబడి పోరాటం చేస్తోంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!