Israel: ఇజ్రాయిల్తో యుద్ధానికి సిద్ధమవుతున్న హిజ్బుల్లా.. భారీ మూల్యం చెల్లించుకుంటారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్-హమాస్ పోరు గత రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 7న హమాస్ మారణకాండ వల్ల ఇజ్రాయిల్ లో 1400 మంది మరణించారు. హమాస్ అత్యంత క్రూరంగా పిల్లలు, మహిళలు, వృద్ధులని చూడకుండా ఊచకోత కోసింది. ఈ ఘటన తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయిల్, గాజా స్ట్రిప్ ప్రాంతంపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో గాజాలో 4000 మంది మరణించారు.
ఇదిలా ఉంటే హమాస్ కి మద్దతుగా ఉత్తరాన లెబనాన్ నుంచి హిజ్బుల్లా మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై విరుచుకుపడుతున్నారు. ఇటీవల ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని సైనికుల స్థావరాలపై దాడులు చేశారు. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాల్లంట్ శనివారం మాట్లాడుతూ.. లెబనాన్ సాయుధ గ్రూప్ హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాడులు చేయాలని నిర్ణయించుకుందని, అయితే వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ఆయన హెచ్చరించారు.
Also Read
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- Hamas Crypto Funding: హమాస్కు చావుదెబ్బ.. క్రిప్టో నెట్వర్క్పై FBI మెరుపుదాడి.. రూ. కోట్లలో నిధులు సీజ్!
- US Iran Conflict: మిడిల్ ఈస్ట్లో మిసైల్ వార్.. అమెరికాపై ఇరాన్ ఎదురుదాడితో హైటెన్షన్!
Read Also: Panipuri: పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత
ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఇజ్రాయిల్ పై దాదాపుగా ప్రతీరోజూ దాడులు చేస్తోంది. 2006లో హిజ్బుల్లా-ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరిగింది. అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రికత్త కొనసాగుతోంది. అక్టోబర్ 15న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ కు ఉత్తర ప్రాంతంలో యుద్ధం చేయడంలో ఆసక్తి లేదని, హిజ్బుల్లా నిగ్రహంగా ఉంటే, సరిహద్దుల్లో పరిస్థితి అలాగే ఉంటుందని ఆయన చెప్పారు.
ఇటు హమాస్, అటు హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ఉంది, అయితే ఈ యుద్ధంలో ఇరాన్ కలుగజేసుకుంటే బాగుండదని ఇప్పటికే అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సంక్షోభాన్ని నిరోధించేందుకు ఇప్పటికే రెండు విమానవాహక నౌకలను అమెరికా మధ్యధరా సముద్రంలో మోహరించింది. ఇటీవల హిజ్బుల్లా కీలక నేత హషేమ్ సఫీద్దీన్ తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు, యూరోపియన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
-
Quinton de Kock: 106 పరుగుల విధ్వంసం.. కోహ్లీ, వార్నర్ సరసన డి కాక్.. టీ20ల్లో అరుదైన రికార్డు
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!