Panipuri: పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panipuri: ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
జార్ఖండ్ లోని కోడెర్మాలో రోడ్డు పక్కన వ్యాపారి నుంచి పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగై 50 మంది అస్వస్థతలకు గురయ్యారని ఆరోగ్య అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా వద్ద పానీపూరీ తిన్నట్లు అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
Read Also: KA Paul: 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి.. రూ. 40 లక్షలు ఖర్చు చేయండి..!
పానీ పూరి తిన్న తర్వాత పిల్లలకు, మహిళలకు వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారని, బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బాధితులను కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. పిల్లలు 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నవారే అని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నుంచి మిగిలిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం రాంచీకి పంపినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Venezuela Earthquake: భూమ్మీద నూకలున్నయ్.. 8 రోజుల తర్వాత భూకంప శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన సెక్యూరిటీ గార్డు
-
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!