Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 19 మంది మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడులు
- 19 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది. గాజాలోని సాధారణ పౌరులపై దాడులు జరిగాయి. ఓ ప్రాంతంలో తాగునీటి కోసం నిలబడిన జనసమూహంపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు.. బొత్స సంచలన వ్యాఖ్యలు..
Also Read
సెంట్రల్ గాజాలోని నుసెరాత్లోని నీటి సేకరణ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత 10 మృతదేహాలను అందుకున్నట్లు సెంట్రల్ గాజాలోని అల్-అవ్దా ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారని ఆసుపత్రి తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో నివసించే ప్రత్యక్ష సాక్షి రమదాన్ నాసర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం దాదాపు 20 మంది పిల్లలు, 14 మంది పెద్దలు నీటిని నింపుకోవడానికి వరుసలో నిలబడ్డారని చెప్పారు. ఆ సమయంలో కాల్పులు జరిగినట్లుగా తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
హమాస్-ఇజ్రాయెల్ శాంతి చర్చల్లో పురోగతి దొరకడం లేదని తెలుస్తోంది. హమాస్.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమో బందీలను విడుదల చేయాలని కోరుతుంది. దీంతో ఈ చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లాక వ్యూహం కూడా మారినట్లు తెలుస్తోంది. హమాస్పై యుద్ధం కొనసాగించాలనే ఇజ్రాయెల్ భావిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నెతన్యాహు యుద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!