Gaza-Israel: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 19 మంది మృతి
- గాజాపై ఇజ్రాయెల్ దాడులు
- 19 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది. గాజాలోని సాధారణ పౌరులపై దాడులు జరిగాయి. ఓ ప్రాంతంలో తాగునీటి కోసం నిలబడిన జనసమూహంపై దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ మేరకు పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు.. బొత్స సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
సెంట్రల్ గాజాలోని నుసెరాత్లోని నీటి సేకరణ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి తర్వాత 10 మృతదేహాలను అందుకున్నట్లు సెంట్రల్ గాజాలోని అల్-అవ్దా ఆసుపత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారని ఆసుపత్రి తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో నివసించే ప్రత్యక్ష సాక్షి రమదాన్ నాసర్ మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం దాదాపు 20 మంది పిల్లలు, 14 మంది పెద్దలు నీటిని నింపుకోవడానికి వరుసలో నిలబడ్డారని చెప్పారు. ఆ సమయంలో కాల్పులు జరిగినట్లుగా తెలిపారు.
ఇది కూడా చదవండి: Chhangur Baba: ఛంగూర్ బాబాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలు..
హమాస్-ఇజ్రాయెల్ శాంతి చర్చల్లో పురోగతి దొరకడం లేదని తెలుస్తోంది. హమాస్.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఏమో బందీలను విడుదల చేయాలని కోరుతుంది. దీంతో ఈ చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లాక వ్యూహం కూడా మారినట్లు తెలుస్తోంది. హమాస్పై యుద్ధం కొనసాగించాలనే ఇజ్రాయెల్ భావిస్తోంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే నెతన్యాహు యుద్ధం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందం సాధ్యాసాధ్యాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!