Botsa Satyanarayana: చంద్రబాబు, పవన్ ప్రజలను మోసం చేశారు.. బొత్స సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరం ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్ లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో ఇచ్చిన మాట నిలుకోలేదని.. ప్రజా వ్యతిరేఖ పాలన సాగిస్తోందన్నారు.. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని.. ఓడ దాటక ముందు వాడ మల్లన్న.. ఓడ దాటిన తరువాత బోడి మల్లన్న అన్న చందంగా కూటమి ప్రభుత్వం తయారైందని విమర్శించారు.. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజా సమస్యలపై పోరాడుతున్నామని తెలిపారు.. జగన్ మోహనరెడ్డి పెట్టిన పథకాలనే కొనసాగించి, అంతకంటే మంచి పథకాలను తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు..
READ MORE: Mahavatar Narasimha: హోంబాలే ‘మహావతార్ నరసింహ’ తెలుగులో గీతా ఆర్ట్స్ రిలీజ్
Also Read
- CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
- Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
- Ahmedabad: అమ్మ.. కిలాడీ.. చిరునవ్వుతో పని కానిచ్చేసింది.. వీడియో వైరల్
- IPL 2026: RCB Vs KKR మ్యాచ్కు వర్షం గండం.. మ్యాచ్ రద్దయితే వీరికి పండగే.. RCB పరిస్థితి..?
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంయుక్త వాగ్దానంతో రాష్ట్ర ప్రజల భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి మోసం చేశారని బొత్స సత్యనారాయణ అన్నారు.. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఏమైందని ప్రశ్నించారు. మోసం చేసేవాడు మోసగాడు,దగా చేసేవారిని దగా కోరు అనాలని.. సూపర్ సిక్స్ హామీలు పోయి, ఇప్పుడు పి4 మాయ డ్రామా ఆడుతున్నారన్నారు. రుణాలు పేరుతో మహిళలకు మోసం చేశారని.. చంద్రబాబు వంద అబద్దాలు చెపితే కొడుకు లోకేష్ రెండు వందలు అబద్దాలు చెపుతారని తీవ్ర విమర్శలు చేశారు.. పార్టీ మొత్తం మాయ, దగా తో నడుస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని.. విజయనగరం జిల్లాలో మామిడికి సరైన ధర లేకపోవడంపై చెట్టుకు వదిలేశారన్నారు. కోట్లరూపాయలు అప్పు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. వంద కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు పెట్టలేరా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండ కట్టెందుకే.. వైసీపీ బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని స్పష్టం చేశారు.
READ MORE: Netanyahu: అమెరికా టూర్ తర్వాత నెతన్యాహు కొత్త ఎత్తుగడ! ఈ వారంలోనే ప్లాన్ అమలు
తాజావార్తలు
-
CM Vijay: నీట్ పేపర్ లీక్పై స్పందించిన సీఎం విజయ్.. ఏమన్నారంటే..?
-
Virosh: గ్లోబల్ రికార్డుల వేటలో విజయ్-రశ్మిక జోడీ!
-
Trump: పాపం ట్రంప్.. చైనాలో అమెరికా అధ్యక్షుడికి అవమానం!
-
Natti Kumar: ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సమస్యలకు కారణం!
-
Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్లో కీలక విషయాలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!