Gaza-Israel: గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు.. తగలబడుతున్న భారీ భవంతులు
- గాజాపై భీకర స్థాయిలో ఇజ్రాయెల్ దాడులు
- తగలబడుతున్న భారీ భవంతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా స్వాధీనం.. బందీలను రక్షించడం లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజా దాడుల్లో ఇప్పటి వరకు 41 మంది మృతి చెందగా.. పదుల కొద్ది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక గాజా కాలిపోతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ పేర్కొన్నారు. ఎత్తైన భవనాలు అగ్నికి ఆహుతయ్యాయి.

Also Read
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
- Trump: ట్రంప్తో ఫొటో దిగాలని ముచ్చటపడుతున్నారా? ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
- Jammu Kashmir: పాక్కు దిమ్మతిరిగే ప్రకటన.. కాశ్మీర్పై యూఎస్ రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్యలు
గాజా నగరాన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని.. ఇందులో భాగంగా భారీ వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాము బందీల విడుదలపైనే దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఉగ్రావాదుల మౌళిక సదుపాయాలను కూల్చివేస్తున్నట్లు పేర్కొన్నారు. రాత్రి నుంచి భారీ దాడులు జరుగుతున్నాయని.. పాలస్తీనా భూభాగంలోని అతి పెద్ద నగరంలో ఇంటెన్సివ్ ఆపరేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కోసం తమ సైన్యం పని చేస్తోందని చెప్పారు. ఇక వెనక్కి వెళ్లేది లేదని.. మిషన్ పూర్తయ్యే వరకు వెనక్కి తగ్గేదేలేదని కాట్జ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Pakistan: పాక్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ చైల్డ్ స్టార్ ఉమర్ గుండెపోటుతో మృతి
ప్రస్తుతం హమాస్ చెరలో ఇంకా 48 మంది బందీలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో దాదాపు 20 మంది వరకు సజీవంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా హమాస్తో చర్చలు జరుపుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇక గత వారం ఖతార్లో మకాం వేసిన హమాస్ నాయకుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఐదుగురు హమాస్ నాయకులు, ఒక ఖతార్ అధికారి చనిపోయారు. ఇది అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపింది. ఇజ్రాయెల్ తీరును పలు దేశాలు ఖండించాయి. ఇక ఈ దాడుల వెనుక తన ప్రమేయం లేదని ట్రంప్ ప్రకటించారు. వాస్తవంగా ఖతార్పై దాడి చేయడానికి మొస్సాద్, ఐడీఎఫ్కు కూడా ఇష్టం లేనట్లు తెలుస్తోంది. నెతన్యాహు ఆదేశాలతోనే ఈ దాడులు జరిగినట్లు వార్తలు వినిపించాయి.
ఇది కూడా చదవండి: Odisha: ఒడిశాలో దారుణం.. ప్రియుడి ముందు యువతిపై గ్యాంగ్రేప్
తాజావార్తలు
-
DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
-
PM Modi: యువతపై ప్రత్యేక దృష్టి.. రోజుకో యూనివర్సిటీ సందర్శనకు కేంద్ర మంత్రి!
-
Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
-
Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!