Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియేకి ఎదురుదెబ్బ.. ఇజ్రాయిల్ దాడిలో 10 మంది కుటుంబీలకు మృతి..
- హమాస్కి ఎదురుదెబ్బ..
- ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్..
- పొలిటికల్ చీఫ్ హనియే కుటుంబీకుల మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israeli Air Strike: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేకి భారీ ఎదురుదెబ్బ తాకింది. గతేడాది నుంచి హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడికి ప్రధాన సూత్రధారుల్లో హమాస్ నేత హనియే ఒకరని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ హనియేను మట్టుపెట్టేందుకు టార్గెట్ చేస్తోంది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హనియే కుటుంబంలోని 10 మంది మరణించారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ మంగళవారం తెలిపింది. అయితే, దీనిని ఇజ్రాయిల్ సైన్యం ఇంకా ధృవీకరించలేదు. అనేక మృతదేహాలు శిథిలాల కింద ఉన్నాయని, అయితే, వాటిని వెలికి తీయడానికి అవసరమైన పరికరాలు తమ వద్ద లేవని గాజాలోని అధికారి మహ్మద్ బసల్ తెలిపారు.
Read Also: Prabhas : ప్రభాస్ కు ఇంకా ఆ గాయం తగ్గలేదా.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
హమాస్కి పొలిటికల్ బ్యూరో ఛీఫ్గా ఉన్న హనియే ఖతార్లో ఉంటున్నాడు. అంతకుముందు సెంట్రల్ గాజాలో ఏప్రిల్ నెలలో జరిగిన ఇజ్రాయిల్ దాడిలో ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లను కోల్పోయాడు. కొన్ని నివేదికల ప్రకారం.. అతని కుటుంబంలో దాదాపుగా 60 మంది సభ్యులు మరణించారు. తాజాగా దాడిలో హనియే సోదరి జహర్ హనియే సహా 10 మంది మరణించారని తెలుస్తోంది. మరోవైపు గాజా కాల్పుల విరమణ, బందీల ఒప్పందానికి ఇజ్రాయిల్ కట్టుబడి ఉందని సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని జెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. మరోవైపు హమాస్ని పూర్తిగా మట్టుపెట్టేవరకు యుద్ధాన్ని ముగించమని పార్లమెంట్లో చెప్పారు.
గతేడాది అక్టోబర్ 07న ఇజ్రాయిల్పై హమాస్ మిలిటెంట్లు విరుచుకపడ్డారు, వందలాది రాకెట్లతో దాడి చేశారు. సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ గ్రామాల్లోకి చేరి మారణహోమం సృష్టించారు. ఈ దాడిలో 1200 మంది మరణించగా, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. హమాస్ని పూర్తిగా మట్టుబెట్టే వరకు యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!