Israel-Gaza: ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది మృతి.. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమేనన్న నెతన్యాహు
- ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది మృతి
- జస్ట్ ఇది శాంపిల్ మాత్రమేనన్న నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజా-ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం రాజుకుంది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ అంగీకరించకపోవడంతో ఇజ్రాయెల్ మరోసారి తన ప్రతాపాన్ని చూపించింది. ఏడాదికిపైగా జరిపిన వైమానిక దాడుల్లో ఇప్పటికే గాజా సర్వనాశనం అయింది. తాజాగా జరిపిన దాడుల్లో అయితే భారీ స్థాయిలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు ధ్వంసం అయ్యాయి.
సోమవారం అర్ధరాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. ఈ ఘటనలో హమాస్కు చెందిన కీలక నేతలంతా నేలకొరిగినట్లు సమాచారం అందుతోంది. దాదాపు ఇప్పటి వరకు 413 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మృతదేహాలు, క్షతగాత్రులతో ఆస్పత్రులు రక్తమోడాయి.
Also Read
ఇది కూడా చదవండి: Ghaziabad: ఈ-రిక్షా బ్యాటరీ పేలి.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలు
ఇదిలా ఉంటే తాజాగా హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని.. ముందు ముందు మరిన్ని పరిణామాలు ఉంటాయని హెచ్చరిచారు. కాల్పుల విరమణ తర్వాత అతిపెద్ద దాడిగా చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే తాజా దాడుల్లో గాజా ప్రభుత్వ అధిపతి ఎస్సామ్ అల్-డాలిస్ ఉన్నట్లుగా హమాస్ తెలిపింది. అలాగే 400 మందికి పైగా కీలక నేతలు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఇక శిథిలాల కింద అనేక మంది ఉన్నట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!
2023, అక్టోబర్ 7న హమాస్ అమాంతంగా ఇజ్రాయెల్పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆనాటి నుంచి హమాస్ అంతమే లక్ష్యంగా భీకరదాడులకు పాల్పడింది. వందలాది మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణ లభించింది. ఆ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. అయితే ఈ ఒప్పందం ఇటీవల ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ అందుకు హమాస్ అంగీకరించలేదు. పైగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని… బందీలను ఒకేసారి విడుదల చేయకపోతే.. హమాస్ నరకం చూస్తోందని హెచ్చరించారు. అయినా కూడా హమాస్ లొంగలేదు. ఒప్పందం ప్రకారమే బందీలను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. దీంతో తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు దిగింది. భవిష్యత్లో మరిన్ని దాడులు జరగొచ్చని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తేల్చి చెప్పారు. అలాగే సిరియా, లెబనాన్పై కూడా దాడులకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: Ranya Rao: రన్యారావు అరెస్ట్ కాగానే నటుడు తరుణ్ రాజ్ ఏం చేశాడంటే..!
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?