అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ శరీర భాగాలు లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. హత్యకు గురైంది దీప అనే ట్రాన్స్ జెండర్గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలను గుర్తించారు. వై జంక్షన్ సమీపంలో తల, మరో చెయ్యి లభించింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేయగా.. హిజ్రా దీపగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కసింకోట మండలం తాళ్లపాలెం బ్రిడ్జి కింద మహిళ మెడ నుండి నడుము వరకు శరీర భాగం గుర్తించిన పోలీసులు గుర్తించారు. నిన్న బయ్యవరం వద్ద నడుము కింద నుండి రెండు కాళ్లు, ఒక చెయ్యి లభించాయి. ఈరోజు అనకాపల్లి వై జంక్షన్ వద్ద డైట్ కాలేజీ సమీపంలో తల, ఒక చెయ్యి దొరికాయి. తోటి ట్రాన్స్ జెండర్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ట్రాన్స్ జెండర్స్ను విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు. ట్రాన్స జెండర్గా మారిన దీపు, మరొక హిజ్రా, ఓ వ్యక్తితో కలిసి గదిలో అద్దెకు ఉంటున్నారు.
అనకాపల్లి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అగంతుకులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు తెలిపారు. నిన్ననే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు, అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం మరోమారు అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు పోలీసు అధికారులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. త్వరిత గతిన దర్యాప్తు పూర్తి చేసి శిక్ష పడేలా చూడాలని చెప్పారు.