Anakapalle Murder Case: శరీర భాగాలు లభ్యం కేసు.. హత్యకు గురైంది మహిళ కాదు..!
- అనకాపల్లి హత్య కేసులో పోలీసుల పురోగతి
- అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలు
- హత్యకు గురైంది మహిళ కాదు
అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించిన మహిళ శరీర భాగాలు లభ్యం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. హత్యకు గురైంది దీప అనే ట్రాన్స్ జెండర్గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్ సమీపంలో మిగతా శరీర భాగాలను గుర్తించారు. వై జంక్షన్ సమీపంలో తల, మరో చెయ్యి లభించింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేయగా.. హిజ్రా దీపగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇంతకీ ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కసింకోట మండలం తాళ్లపాలెం బ్రిడ్జి కింద మహిళ మెడ నుండి నడుము వరకు శరీర భాగం గుర్తించిన పోలీసులు గుర్తించారు. నిన్న బయ్యవరం వద్ద నడుము కింద నుండి రెండు కాళ్లు, ఒక చెయ్యి లభించాయి. ఈరోజు అనకాపల్లి వై జంక్షన్ వద్ద డైట్ కాలేజీ సమీపంలో తల, ఒక చెయ్యి దొరికాయి. తోటి ట్రాన్స్ జెండర్స్పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ట్రాన్స్ జెండర్స్ను విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు మొదలెట్టారు. ట్రాన్స జెండర్గా మారిన దీపు, మరొక హిజ్రా, ఓ వ్యక్తితో కలిసి గదిలో అద్దెకు ఉంటున్నారు.
Also Read
అనకాపల్లి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు జిల్లా ఎస్పీ, పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. అగంతుకులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు తెలిపారు. నిన్ననే ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు, అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఉదయం మరోమారు అనకాపల్లి జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు పోలీసు అధికారులు వివరించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు. త్వరిత గతిన దర్యాప్తు పూర్తి చేసి శిక్ష పడేలా చూడాలని చెప్పారు.
తాజావార్తలు
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!