Israel-Hamas War: సంధి ముగిసింది, యుద్ధం మొదలైంది.. ఇజ్రాయిల్ దాడి, 240 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ సంధి ముగియడంతో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఖతార్ మధ్యవర్తిత్వంతో వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ, బందీలు-ఖైదీల మార్పిడి నిలిచిపోయింది. సంధిని పొడగించాలని ప్రపంచదేశాలు పిలుపునిచ్చినప్పటికీ.. ఇజ్రాయిల్ పునరుద్ధరించడానికి సిద్ధంగా లేదు. దీంతో గాజాపై ఇజ్రాయిల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. గాజా స్ట్రిప్పై శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 240 మంది మరణించినట్లు హమాస్ తెలిపింది.
ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంధి గడువు శుక్రవారంతో ముగిసింది. సాయం చేయడానికి ఈజిప్టు నుంచి రఫా బార్డర్ వద్దకు రావద్దని ఇజ్రాయిల్ ఎన్జీవోలకు చెప్పింది. ఇప్పటి వరకు సంధిలో భాగంగా హమాస్ తమ చెరలో ఉన్న 80 మంది ఇజ్రాయిల్ బందీలను వదిలిపెట్టింది. ఇజ్రాయిల్ తన జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయిల్పై చేసిన దాడిలో 1200 మందిని చంపింది, 240 మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లింది.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
Read Also: Earthquak: ఫిలిఫ్పీన్స్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
సంధి ముగిసిన తర్వాత 400 కంటే ఎక్కువ టార్గెట్లపై ఇజ్రాయిల్ దాడులు చేసినట్లు సైన్యం శనివారం వెల్లడించింది. ఇన్నాళ్లు రక్షణగా ఉన్న దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ఖాన్ యూనిస్ ప్రాంతంలో 50 కంటే ఎక్కువ లక్ష్యాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 15 వేల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో 40 శాతం పిల్లలు ఉన్నారు.
అంతకుముందు సంధి ముగియడానికి మరింత సమయం ఉన్నప్పటికీ.. హమాస్ గాజా నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ చర్యల వల్లే సంధి విఫలమైందని అమెరికా ఆరోపించింది. మరోవైపు గాజాపై మరోసారి దాడులు మొదలైనందుకు తీవ్రంగా చింతిస్తున్నట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మరోవైపు సంధి ముగియడంతో ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలో లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా దాడుల్ని మళ్లీ ప్రారంభించింది. శనివారం సిరియా రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసిందని సిరియా తెలిపింది. ఇదిలా ఉంటే మరో సంధి ఒప్పందాన్ని తీసుకురావడానికి పలు దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!