Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చల్లో పురోగతి.. ఈజిప్టు చర్చలు ఫలించినట్లు సమాచారం!
- ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చల్లో పురోగతి
- ఈజిప్టు చర్చలు ఫలించినట్లు సమాచారం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. దీంతో సోమవారం ఈజిప్టు రిసార్ట్లో పరోక్ష చర్చలు జరిగాయి. దీనికి హమాస్ బృందానికి ఖలీల్ అల్ హయ్యా నేతృత్వం వహించగా.. ఇజ్రాయెల్ బృందానికి నెతన్యాహు సన్నిహితుడు రాన్ డెర్మర్ నాయకత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల పాక్షిక ఉపసంహరణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు ఎర్ర సముద్ర తీరంలోని షర్మ్ ఎల్-షేక్ రిసార్టులో జరిగాయని ఈజిప్టు అధికారి తెలిపారు. అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు
Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
సోమవారం ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లుగా అల్-ఖేరా న్యూస్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు ఆపాలని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపలేదు. గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి మొత్తం 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఇది కూడా చదవండి: Priyanka Suicide Tragedy: పెళ్లికి ప్రియుడు ససేమిరా.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు
ట్రంప్ ప్రయత్నాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా ఎల్-సీసీ ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్ బహుమతి కమిటీని కోరారు. ‘‘ప్రపంచ శాంతికి అపూర్వమైన సహకారం’’ చేస్తున్నారంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. శాంతి చర్చలు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బందీలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హమాస్ వైఖరిపై నెతన్యాహు నిరాశగా స్పందించడంతో ‘‘నువ్వు ఎప్పుడూ ఎందుకింత దారుణమైన నెగెటివిటీని కలిగి ఉంటావో అర్థం కావడం లేదు. ఇదొక విజయం. దీన్ని స్వాగతించు’’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
- Tags
- america
- Egypt
- Hamas
- Israel
- peace talks
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!