Iran-Israel War: ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం.. ఇజ్రాయెల్పై 100 డ్రోన్లు ప్రయోగం
- ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం
- ఇజ్రాయెల్పై 100 డ్రోన్లు ప్రయోగం
- డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న ఇజ్రాయెల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్పై 100 డ్రోన్లలను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ అన్నారు. ఇరాన్ 100కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఇరాన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Donald Trump: ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తుందని నాకు ముందే తెలుసు..
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడి చేసింది. టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల శబ్ధానికి ప్రజలంతా భయాందోళనతో మేల్కొ్న్నారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ టెలివిజన్ కూడా పేలుడు శబ్ధాన్ని గుర్తించింది.
ఇది కూడా చదవండి: Air India plane crash: విమానం చివరి క్షణాల్లో పైలట్లు ఏం చేసి ఉండొచ్చు..?
ఇదిలా ఉంటే ఇరాన్ రాజధాని టెహ్రాన్పై 200 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 లక్ష్యాలను ఎంచుకోగా.. విజయవంతంగా ఇజ్రాయెల్ ముగించింది. ఈ దాడుల్లో ఇరాన్లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాకుండా ఇరాన్లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి కూడా మరణించారు. ఐఆర్జీసీ హెడ్క్వార్టర్స్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మేజర్ జనరల్ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియా తెలిపింది. అంతేకాకుండా ఐడీఎఫ్ కూడా ధృవీకరించింది.
ఇక బాఘేరి టెహ్రాన్లో జన్మించారు. 2016 నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ యొక్క సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. ఇది దేశంలో అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్లో నిపుణుడు. 1980లో ఐఆర్జీసీలో చేరి ఇరాన్-ఇరాక్ యుద్ధంలో పోరాడారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన పీహెచ్డీ చేశారు. జనరల్ స్టాఫ్లో ఇంటెలిజెన్స్ మరియు ఆపరేషన్ల కోసం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న బాఘేరి జూన్ 28, 2016న సాయుధ దళాల జనరల్ స్టాఫ్ (AFGS) కొత్త ఛైర్మన్గా పదోన్నతి పొందారు. ఇరవై ఏడు సంవత్సరాలు ఆ పదవిలో ఉన్న హసన్ ఫిరోజబాది స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇక బాఘేరి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?