Iran Blasts: ఖాసిం సులేమాని సమాధి వద్ద జంట పేలుళ్లు.. అమెరికా, ఇజ్రాయిల్ పనేనని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Blasts: ఇరాన్ రివల్యూషనరీ జనరల్ ఖాసిం సులేమాని మరణించి నాలుగేళ్లు అవుతున్న నేపథ్యంలో ఆయన సంస్మరణ సభ నిర్వహిస్తున్న కార్యక్రమంలో జంట పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్ల వల్ల 95 మంది చనిపోయారు. అయితే ఈ పేలుళ్లకు అమెరికా, ఇజ్రాయిల్ కారణమని ఇరాన్ బుధవారం నిందించింది. గాజా యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే ఇరాన్ దాడిలో తమ ప్రమేయం లేని అమెరికా చెప్పింది. ఇదిలా ఉంటే ఈ దాడిపై ఇజ్రాయిల్ స్పందించలేదు.
దాడిలో అమెరికా హస్తం లేదని, ఇజ్రాయిల్ ప్రమేయం ఉన్నట్లు మేము నమ్మడానికి ఎలాంటి కారణం లేదని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యు మిల్లర్ అన్నారు. పేలుళ్ల గురించి అడగగా, ఇజ్రాయిల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హగారి స్పందిస్తూ.. మేము హమాస్తో పోరాటంపై దృష్టి పెట్టామన్నారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యకు తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు, దాడిని హేయమైన నేరంగా అభివర్ణించారు. ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, సౌదీ అరేబియా, జోర్డాన్, జర్మనీ మరియు ఇరాక్తో సహా అనేక దేశాలు పేలుళ్లను ఖండించాయి.
Also Read
- Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
Read Also: Madhya Pradesh: ‘‘నీ స్థాయి ఎంత’’.. సామాన్యుడిపై కలెక్టర్ చిందులు.. తీవ్రంగా స్పందించిన సీఎం..
2020లో ఇరాక్ పర్యటనకు వెళ్లిన ఖాసి సులేమానిని బాగ్దాద్లో అమెరికా హతమార్చింది. డ్రోన్ దాడితో అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చేసింది. సులేమాని చనిపోయి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా దక్షిణ ఇరాన్ లోని అతని స్వస్థలం కెర్మాన్ లోని సాహెబ్ అల్ జమాన్ మసీదులోని అతని సమాధి వద్ద జనాలు పెద్ద సంఖ్యలు ఉన్నప్పుడు 15 నిమిషాల వ్యవధిలో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. ఇరాన్ అధికార వార్త సంస్థ ప్రకారం దాడిలో 103 మంది మరణించారని, 211 మంది గాయపడ్డారని తెలిపింది.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..