Canada: విషాదం.. భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- కెనడాలో విషాదం
- భారతీయ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- గద్దె గది కోసం బయటకు వెళ్లి బీచ్లో శవమై కనిపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మరణవార్తను భారత హైకమిషన్ ధృవీకరించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.
ఇది కూడా చదవండి: AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
వివరాల్లోకి వెళ్తే.. వంశిక పంజాబ్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ రాంధావా సన్నిహితుడు దేవిందర్ సింగ్ కుమార్తె. పంజాబ్లోని డేరా బస్సీకి చెందిన వంశిక పాఠశాల విద్యను పూర్తి చేశాక.. డిప్లొమా కోర్సును అభ్యసించడానికి రెండున్నర సంవత్సరాల క్రితం కెనడాలోని ఒట్టావాకు వెళ్లింది. అయితే ఈనెల 25న అద్దె గది కోసం బయటకు వెళ్లింది. సాయంత్రం 8-9 గంటల ప్రాంతంలో 7 మెజెస్టిక్ డ్రైవ్లోని నివాసం నుంచి బయటకు వెళ్లింది. రాత్రి 11:40 గంటలకు ఆమె ఫోన్ స్వి్చ్ఆఫ్ వచ్చింది. అంతేకాకుండా మరుసటి రోజు ఒక ముఖ్యమైన పరీక్షకు కూడా హాజరుకాలేదు. దీంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఆచూకీ కోసం స్నేహితులు సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో భారత హై కమిషన్ను కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు రంగంలోకి దిగగా.. వంశిక బీచ్లో శవమై కనిపించింది. కుమార్తె మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు తల్లడిల్లారు.
ఇది కూడా చదవండి: Vijay Devarakonda : కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక భారత హైకమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గద్దె కోసం బయటకు వెళ్లిన వంశిక.. ఇన్ని రోజులు ఎక్కడుంది? బీచ్కు ఎలా వెళ్లింది అన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వంశిక మృతి పట్ల భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది. కేసును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. మృతురాలి బంధువులకు టచ్లో ఉన్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
India First Hydrogen Train: భారత్ తొలి హైడ్రోజన్ రైలు ట్రయల్ రన్ సక్సెస్.. గంటకు 120 కిమీ వేగంతో పరుగులు
-
Donald Trump: “ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే”.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
-
Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
-
Vivo X Fold 6: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో వివో ఎక్స్ ఫోల్డ్ 6 విడుదల.. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త బెంచ్మార్క్
-
TTD: రామ మందిరం విరాళాల వివాదం ఎఫెక్ట్.. టీటీడీ ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్.! ఖాతాలకు టెక్నాలజీ అప్గ్రేడ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!