AP Capital Amaravati: అమరావతి రాజధానికి చట్టబద్ధత..!
- ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత..
- ఆ దశగా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు..
- మంత్రి నారాయణ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కలిగించే దిశగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడతారన్నారు అని వెల్లడించారు మంత్రి నారాయణ.. చట్టబద్ధత విషయంలో రైతుల్లో ఉన్న ఆందోళన నిన్న సీఎం దృష్టికి రైతులు తీసుకు వచ్చారన్నారు నారాయణ.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఏర్పాట్లును పరిశీలించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రాజధాని అమరావతి కాదని చెప్పింది.. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైందన్నారు.. ఇదే విషయాన్ని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి నిన్న తీసుకువచ్చారు.. న్యాయ పరమైన అంశాలు చర్చించి కేంద్రంతో మాట్లాడతా అని సీఎం చంద్రబాబు.. రైతులకు చెప్పారని వెల్లడించారు..
Read Also: Canada Elections Results: ఆధిక్యంలో దూసుకెళ్తున్న మార్క్ కార్నీ పార్టీ
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ఇక, ప్రధాని పర్యటనకు సంబంధించి పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలిపారు మంత్రి నారాయణ.. 41 వేల కోట్ల విలువైన పనులకు శంఖుస్థాపన గతంలో జరిగింది.. గత ప్రభుత్వం టెండర్లు రద్దు చేయలేదు.. న్యాయపరంగా ఇబ్బందులు వచ్చాయన్నారు.. మళ్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని పనులు ప్రారంభం అయ్యాయి.. 8 నెలలు నుంచి రాజధానిపై కసరత్తు చేస్తున్నాం అన్నారు.. మళ్లీ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీద పనులు మళ్లీ ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి నారాయణ.. కాగా, ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ విభజన చట్టంలో పార్లమెంటు ద్వారా సవరణ చేసేందుకు అవకాశం ఉందేమో పరిశీలించి, చేయిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే.. ఈ అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళతానని.. రాజధాని ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని పేర్కొన్నారు.. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో.. ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసేందుకు ఇబ్బంది ఉండకపోవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
-
Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!