Iran-Israel War: ఇరాన్లో భారత ఇంజనీర్ అదృశ్యం.. కుటుంబ సభ్యుల ఆందోళన
- ఇరాన్లో భారత ఇంజనీర్ అదృశ్యం
- కుటుంబ సభ్యుల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించింది. దీంతో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో భారత్కు చెందిన ఒక ఇంజనీర్ ఇరాన్లో అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. తమకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంది.
ఇది కూడా చదవండి: Maharashtra: అమానుషం.. నీట్ మాక్ టెస్ట్లో ఫెయిలైందని కర్రతో దాడి.. కుమార్తె మృతి
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
బీహార్కు చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ.. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అతడితో పాటు మరికొంత మంది ఇరాన్లో ఒక ప్లాంట్ నిర్మాణం కోసం పని చేస్తున్నారు. జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా సిరాజ్ ఇరాన్ చేరుకున్నాడు. ఇంతలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే సిరాజ్ పని చేస్తున్న ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగాయి. అక్కడ వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. జూన్ 17న సిరాజ్తో కుటుంబ సభ్యులు చివరి సారిగా ఫోన్లో మాట్లాడారు. అప్పటి నుంచి సిరాజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఇరాన్లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని వేడుకున్నారు.
ఇది కూడా చదవండి: TTD: తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. ఇప్పటికే విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇక సొంత రవాణా సౌకర్యాలు కలిగిన వారు కూడా భారత్కు వచ్చేయాలని తెలిపింది. ఇంతలోనే సిరాజ్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారత ఎంబసీ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!