Russia-Ukraine War: ఈ ఐదు మార్గాల ద్వారా ఉక్రెయిన్ విడిచిపెట్టండి.. భారతీయులకు ఎంబసీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Embassy Shares 5 Options For Border Crossing To Leave Ukraine Amid War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. క్రిమియాలో కేర్చ్ వంతెన కూల్చేసిన తర్వాత రష్యా దాడులను తీవ్రం చేసింది. వరసగా కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని బుధవారం సూచించింది భారత విదేశీ మంత్రిత్వశాఖ. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విడిచిపెట్టేందుకు ఐదు మార్గాలను సూచించింది. యుద్ధం నేపథ్యంలో భారతీయుల రక్షణ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ కొన్ని సూచనలు చేసింది. యుద్ధ ప్రాంతాలకు ప్రయాణించకుండా హెచ్చరించింది. భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి అందుబాటులో ఉన్న మార్గాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Also Read
- Sheikh Hasina: "నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు": షేక్ హసీనా
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
ఉక్రెయిన్-హంగేరీ, ఉక్రెయిన్-స్లోవేకియా సరిహద్దు, ఉక్రెయిన్-మాల్డోవా, ఉక్రెయిన్-పోలాండ్, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దులను దాటి ఉక్రెయిన్ దేశాన్ని వీడాలని సూచించింది. సరిహద్దులు దాటేటప్పుడు భారతీయులు తప్పకుండా భారత పాస్ పోర్టు, ఉక్రెయిన్ రెసిడెంట్ పర్మిట్, స్టూడెంట్ కార్డ్, విమాన టికెట్ కలిగి ఉండాలని సూచించింది. ఉక్రెయిన్- హంగేరి సరిహద్దు వద్ద జకర్పతియా ప్రాంతంలో చెక్ పోస్టులు ఉన్నాయని ఎంబసీ తెలిపింది. సరిహద్దు దాటే ముందు ఆయా దేశాల ఎంబసీలను సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాత ‘ ఆపరేషన్ గంగా’ పేరుతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను ఎయిర్ లిప్ట్ చేసింది భారతప్రభుత్వం. రొమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్డోవా దేశాల మీదుగా వారిని సురక్షితంగా ఇండియాకు చేర్చారు.
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ దేశంపై విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్రజలు వలస వెళ్లేలా చేస్తోంది రష్యా. ఇప్పటికే కరెంట్ లేక ఉక్రెయిన్ నగరాలు అంధకారంలో ఉన్నాయి. రానున్న మరికొన్ని రోజల్లో దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఏర్పడింది. దాదాపుగా 30 శాతం విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. శీతాకాలంలో కరెంట్ లేకపోతే ఇళ్లను వెచ్చపరుచుకునే వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆవశ్యకత ఏర్పడుతుందనేది రష్యా ప్లాన్ గా తేలుస్తోంది.
తాజావార్తలు
-
Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
-
Investment Tips: హోమ్ లోన్ తీర్చాలా? ఇన్వెస్ట్ చేయాలా? చేతికి బోనస్ వస్తే ఏది బెస్ట్ ఆప్షన్! నిపుణులు చెబుతున్నది ఇదే..
-
Ishan Kishan Celebration: స్టేడియం ఖాళీ చేయండి, ఇంటికి వెళ్లిపోండి.. సీఎస్కే అభిమానులను అవమానించిన ఇషాన్ ఇషాన్!
-
Chand Mera Dil: అనన్యా పాండే మూవీకి సెన్సార్ షాక్..10 సెకన్ల కిస్ సీన్ డిలీట్
-
Washing Machine Tips: వాషింగ్ మెషీన్లో ఈ 2 పదార్థాలు కలిపితే చాలు.. మీ బట్టలు కొత్తవాటిలా మెరిసిపోతాయి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!