Russia-Ukraine War: ఈ ఐదు మార్గాల ద్వారా ఉక్రెయిన్ విడిచిపెట్టండి.. భారతీయులకు ఎంబసీ సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Embassy Shares 5 Options For Border Crossing To Leave Ukraine Amid War: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. క్రిమియాలో కేర్చ్ వంతెన కూల్చేసిన తర్వాత రష్యా దాడులను తీవ్రం చేసింది. వరసగా కామికేజ్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తోంది రష్యా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు వెంటనే ఉక్రెయిన్ విడిచిపెట్టాలని బుధవారం సూచించింది భారత విదేశీ మంత్రిత్వశాఖ. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విడిచిపెట్టేందుకు ఐదు మార్గాలను సూచించింది. యుద్ధం నేపథ్యంలో భారతీయుల రక్షణ నేపథ్యంలో ఉక్రెయిన్ లోని భారత ఎంబసీ కొన్ని సూచనలు చేసింది. యుద్ధ ప్రాంతాలకు ప్రయాణించకుండా హెచ్చరించింది. భారతీయులు ఉక్రెయిన్ సరిహద్దులు దాటడానికి అందుబాటులో ఉన్న మార్గాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు.
Read Also: Andhra Pradesh: మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఉక్రెయిన్-హంగేరీ, ఉక్రెయిన్-స్లోవేకియా సరిహద్దు, ఉక్రెయిన్-మాల్డోవా, ఉక్రెయిన్-పోలాండ్, ఉక్రెయిన్-రొమేనియా సరిహద్దులను దాటి ఉక్రెయిన్ దేశాన్ని వీడాలని సూచించింది. సరిహద్దులు దాటేటప్పుడు భారతీయులు తప్పకుండా భారత పాస్ పోర్టు, ఉక్రెయిన్ రెసిడెంట్ పర్మిట్, స్టూడెంట్ కార్డ్, విమాన టికెట్ కలిగి ఉండాలని సూచించింది. ఉక్రెయిన్- హంగేరి సరిహద్దు వద్ద జకర్పతియా ప్రాంతంలో చెక్ పోస్టులు ఉన్నాయని ఎంబసీ తెలిపింది. సరిహద్దు దాటే ముందు ఆయా దేశాల ఎంబసీలను సంప్రదించాలని సూచించింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన తర్వాత ‘ ఆపరేషన్ గంగా’ పేరుతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను ఎయిర్ లిప్ట్ చేసింది భారతప్రభుత్వం. రొమేనియా, పోలాండ్, స్లోవేకియా, మాల్డోవా దేశాల మీదుగా వారిని సురక్షితంగా ఇండియాకు చేర్చారు.
ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ దేశంపై విరుచుకుపడుతోంది. ప్రధాన నగరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి ప్రజలు వలస వెళ్లేలా చేస్తోంది రష్యా. ఇప్పటికే కరెంట్ లేక ఉక్రెయిన్ నగరాలు అంధకారంలో ఉన్నాయి. రానున్న మరికొన్ని రోజల్లో దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఏర్పడింది. దాదాపుగా 30 శాతం విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. శీతాకాలంలో కరెంట్ లేకపోతే ఇళ్లను వెచ్చపరుచుకునే వ్యవస్థ దెబ్బతింటుంది. దీని వల్ల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆవశ్యకత ఏర్పడుతుందనేది రష్యా ప్లాన్ గా తేలుస్తోంది.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!