S Jaishankar: ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన మీరా మాట్లాడేది..? పాక్ తీరుపై నిప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో ఎత్తి చూపుతూ.. ఘాటు విమర్శలు చేశారు. బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇవ్వడంతో పాటు పొరుగును ఉన్న పార్లమెంట్ పై దాడికి తెగబడిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తుందని జైశంకర్ పాకిస్తాన్ తీరును విమర్శించారు.
Read Also: FIFA World Cup: ఫైనల్స్కు చేరిన ఫ్రాన్స్.. సెమీస్లో మొరాకో చిత్తు
Also Read
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
ఐక్యరాజ్య సమితిలో భారత ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ తన మిత్రదేశం అయిన పాకిస్తాన్ ను కాపాడుతూ వస్తున్న చైనా తీరును కూడా జైశంకర్ ఎండగట్టారు. భద్రతా మండలి ఆంక్షల కమిటిలో చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగించి జైష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను కాపాడుతూ వస్తోంది. దీనిపై కూడా చైనా తీరును కూడా పరోక్షంగా విమర్శించారు. అత్యంత శక్తివంతమైన 15 దేశాల భద్రతా మండలి సమావేశాలు భారత్ అధ్యక్షతన జరిగాయి. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. మహమ్మారి, ఉగ్రవాదం, వాతావారణ మార్పు కీలక సవాళ్లపై పనిచేయడంపై ఐక్యరాజ్యసమితి విశ్వనీయత ఆధారపడి ఉందని అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నాయని.. పాకిస్తాన్ గురించి పరోక్షంగా ప్రస్తావించారు.
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని, ఆర్టికల్ 370, 35ఏని రద్దు చేసిన తర్వాత భారత్-పాక్ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా క్షీణించాయి. దీంతో పాకిస్తాన్ పలు అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితిలో ఏ అంశంపై చర్చ జరిగినా.. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. కాశ్మీర్ మాట ఎత్తినప్పుడల్లా భారత్, పాకిస్తాన్ కు ధీటుగా సమాధానం ఇస్తోంది. ఆర్టికల్ 370 రద్దు భారత అంతర్గత విషయం అని పలు వేదికలపై భారత్ పదేపదే చెబుతోంది. ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలో మాత్రమే పాకిస్తాన్ తో సంబంధాలు ఉంటాయని భారత్ చెబుతోంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!