Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Operation Kaveri To Evacuate Citizens From Sudan Begins: సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలతో సూడాన్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచారు. అలాగే.. సూడాన్ తీరంలోనూ ఐఎన్ఎస్ సుమేధను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించిన భారత్.. దీనికి ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా.. ఆల్రెడీ సుడాన్ తీరానికి 500 మంది భారతీయులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘మా నౌకలు, విమానాలు సుడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్లోని మన భారతీయ సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
Also Read
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
- Trump: నా యుద్ధ అధికారాల్ని పరిమితం చేయడం దేశద్రోహం.. డెమోక్రాట్లపై ట్రంప్ ఆగ్రహం
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
కాగా.. వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, అలాగే ఐఎన్ఎస్ సుమేధ భారతీయుల్ని తరలించడానికి సుడాన్ పోర్ట్కు చేరుకుందని ఆదివారం భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే! పౌరుల తరలింపు ప్రకటన వచ్చిన వెంటనే.. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ పౌరులతో పాటు భారతదేశం సహా మొత్తం 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. గత వారం సుడాన్లో కాల్పులు జరిగినప్పుడు.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ సిబ్బందిలోని ముగ్గురు భారతీయుల్ని సౌదీ అరేబియాకు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున.. భారతీయ పౌరులతో సహా మొత్తం 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్కు తరలించడం జరిగింది. ‘‘ఫ్రెంచ్ తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి రెండు సైనిక విమానాల రొటేషన్లు.. భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని తరలించాయి’’ అని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
అటు.. ఆపరేషన్ కావేరిని ప్రారంభించడానికి ముందు.. భారత పౌరుల తరలింపు ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ విదేశాంఖ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నామని.. వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచామని, ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్టుకు చేరుకుందని తెలిపింది. అయితే, రాజధాని ఖార్తూమ్తోపాటు ఆయా ప్రాంతాల్లో భీకర ఘర్షణలు సాగుతున్నాయని, తద్వారా తరలింపు ప్రణాళికలన్నీ క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!