Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Operation Kaveri To Evacuate Citizens From Sudan Begins: సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలతో సూడాన్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచారు. అలాగే.. సూడాన్ తీరంలోనూ ఐఎన్ఎస్ సుమేధను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించిన భారత్.. దీనికి ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా.. ఆల్రెడీ సుడాన్ తీరానికి 500 మంది భారతీయులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘మా నౌకలు, విమానాలు సుడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్లోని మన భారతీయ సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
కాగా.. వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, అలాగే ఐఎన్ఎస్ సుమేధ భారతీయుల్ని తరలించడానికి సుడాన్ పోర్ట్కు చేరుకుందని ఆదివారం భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే! పౌరుల తరలింపు ప్రకటన వచ్చిన వెంటనే.. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ పౌరులతో పాటు భారతదేశం సహా మొత్తం 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. గత వారం సుడాన్లో కాల్పులు జరిగినప్పుడు.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ సిబ్బందిలోని ముగ్గురు భారతీయుల్ని సౌదీ అరేబియాకు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున.. భారతీయ పౌరులతో సహా మొత్తం 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్కు తరలించడం జరిగింది. ‘‘ఫ్రెంచ్ తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి రెండు సైనిక విమానాల రొటేషన్లు.. భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని తరలించాయి’’ అని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
అటు.. ఆపరేషన్ కావేరిని ప్రారంభించడానికి ముందు.. భారత పౌరుల తరలింపు ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ విదేశాంఖ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నామని.. వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచామని, ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్టుకు చేరుకుందని తెలిపింది. అయితే, రాజధాని ఖార్తూమ్తోపాటు ఆయా ప్రాంతాల్లో భీకర ఘర్షణలు సాగుతున్నాయని, తద్వారా తరలింపు ప్రణాళికలన్నీ క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
తాజావార్తలు
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!