Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Operation Kaveri To Evacuate Citizens From Sudan Begins: సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలతో సూడాన్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచారు. అలాగే.. సూడాన్ తీరంలోనూ ఐఎన్ఎస్ సుమేధను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించిన భారత్.. దీనికి ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా.. ఆల్రెడీ సుడాన్ తీరానికి 500 మంది భారతీయులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘మా నౌకలు, విమానాలు సుడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్లోని మన భారతీయ సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
కాగా.. వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, అలాగే ఐఎన్ఎస్ సుమేధ భారతీయుల్ని తరలించడానికి సుడాన్ పోర్ట్కు చేరుకుందని ఆదివారం భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే! పౌరుల తరలింపు ప్రకటన వచ్చిన వెంటనే.. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ పౌరులతో పాటు భారతదేశం సహా మొత్తం 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. గత వారం సుడాన్లో కాల్పులు జరిగినప్పుడు.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ సిబ్బందిలోని ముగ్గురు భారతీయుల్ని సౌదీ అరేబియాకు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున.. భారతీయ పౌరులతో సహా మొత్తం 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్కు తరలించడం జరిగింది. ‘‘ఫ్రెంచ్ తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి రెండు సైనిక విమానాల రొటేషన్లు.. భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని తరలించాయి’’ అని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
అటు.. ఆపరేషన్ కావేరిని ప్రారంభించడానికి ముందు.. భారత పౌరుల తరలింపు ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ విదేశాంఖ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నామని.. వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచామని, ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్టుకు చేరుకుందని తెలిపింది. అయితే, రాజధాని ఖార్తూమ్తోపాటు ఆయా ప్రాంతాల్లో భీకర ఘర్షణలు సాగుతున్నాయని, తద్వారా తరలింపు ప్రణాళికలన్నీ క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!