Operation Kaveri: ఆపరేషన్ కావేరి షురూ.. సుడాన్ పోర్టుకి తరలి వస్తున్న ఇండియన్స్
India Operation Kaveri To Evacuate Citizens From Sudan Begins: సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణలతో సూడాన్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. భారత ప్రభుత్వం అక్కడి చిక్కుకుపోయిన భారతీయుల్ని సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచారు. అలాగే.. సూడాన్ తీరంలోనూ ఐఎన్ఎస్ సుమేధను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించిన భారత్.. దీనికి ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా.. ఆల్రెడీ సుడాన్ తీరానికి 500 మంది భారతీయులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే.. ‘‘మా నౌకలు, విమానాలు సుడాన్లో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూడాన్లోని మన భారతీయ సోదరులందరికీ సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నాము’’ అంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్విటర్ మాధ్యమంగా తెలిపారు.
Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
Also Read
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
- Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
- Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
కాగా.. వైమానిక దళం C-130J జెడ్డాలో సిద్ధంగా ఉందని, అలాగే ఐఎన్ఎస్ సుమేధ భారతీయుల్ని తరలించడానికి సుడాన్ పోర్ట్కు చేరుకుందని ఆదివారం భారతదేశం ప్రకటించిన సంగతి తెలిసిందే! పౌరుల తరలింపు ప్రకటన వచ్చిన వెంటనే.. వివిధ దేశాలకు చెందిన 150 మందికి పైగా ప్రజలు శనివారం సౌదీ అరేబియాకు చేరుకున్నారు. వీరిలో సౌదీ పౌరులతో పాటు భారతదేశం సహా మొత్తం 12 ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. గత వారం సుడాన్లో కాల్పులు జరిగినప్పుడు.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ సిబ్బందిలోని ముగ్గురు భారతీయుల్ని సౌదీ అరేబియాకు తరలించారు. ఈరోజు తెల్లవారుజామున.. భారతీయ పౌరులతో సహా మొత్తం 28 దేశాలకు చెందిన 388 మందిని ఫ్రాన్స్కు తరలించడం జరిగింది. ‘‘ఫ్రెంచ్ తరలింపు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. గత రాత్రి రెండు సైనిక విమానాల రొటేషన్లు.. భారతీయ పౌరులతో సహా 28 దేశాలకు చెందిన 388 మందిని తరలించాయి’’ అని భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
అటు.. ఆపరేషన్ కావేరిని ప్రారంభించడానికి ముందు.. భారత పౌరుల తరలింపు ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని భారతీయ విదేశాంఖ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. సూడాన్ అధికారులు, ఐరాసతోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. పౌరుల తరలింపునకు వివిధ అవకాశాలు పరిశీలిస్తున్నామని.. వాయుసేనకు చెందిన రెండు విమానాలను జెడ్డాలో నిలిపి ఉంచామని, ఐఎన్ఎస్ సుమేధ సూడాన్ పోర్టుకు చేరుకుందని తెలిపింది. అయితే, రాజధాని ఖార్తూమ్తోపాటు ఆయా ప్రాంతాల్లో భీకర ఘర్షణలు సాగుతున్నాయని, తద్వారా తరలింపు ప్రణాళికలన్నీ క్షేత్రస్థాయి భద్రతా పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయని పేర్కొంది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
తాజావార్తలు
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!