Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Water Metro To Be Inaugurated In Kochi On April 25: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎన్నో రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ని అదుపు చేసేందుకు.. ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా వాటర్ మెట్రో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. కేరళ ప్రభుత్వం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే ఈ మెట్రో సర్వీస్ను అందుబాటులోకి తెస్తోంది.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ ఈ వాటర్ మెట్రో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ మెట్రో సర్వీస్లో బ్యాటరీ సాయంతో నడిచే మొత్తం 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినల్స్ నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలను సాగిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్డబ్ల్యూ(KfW) సంయుక్తంగా కలిసి.. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ను రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది పూర్తిగా విద్యుత్ సహాయంతో పని చేస్తుంది. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతానికైతే.. రోజూ 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఓడల్లో ఏసీ, వైఫై సౌకర్యాలూ ఉన్నాయి.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభ ధర రూ.20 కాగా.. గరిష్ట టికెట్ ధర రూ.40 గా కేటాయించారు. అంతేకాదు.. పాస్ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ఖరీదు రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ.600 గానూ, మూడు నెలల పాస్ ఖరీదు రూ.1500 గానూ నిర్ణయించారు. దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదేనని, దీని ద్వారా కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
-
Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
-
AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
-
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!