Water Metro: దేశంలోనే తొలి వాటర్ మెట్రో.. రేపే ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India First Water Metro To Be Inaugurated In Kochi On April 25: ప్రయాణికుల సౌలభ్యం కోసం ఎన్నో రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ని అదుపు చేసేందుకు.. ఇప్పటికే మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లేటెస్ట్గా వాటర్ మెట్రో సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 25వ తేదీన ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే తొలి వాటర్ మెట్రో. కేరళ ప్రభుత్వం కొచ్చి వాటర్ మెట్రో పేరుతో నీటిపై నడిచే ఈ మెట్రో సర్వీస్ను అందుబాటులోకి తెస్తోంది.
Sai Dharam Tej: ఏం మెగా మేనల్లుడు గారు.. చిన్న మామపై సెటైర్ వేస్తున్నారు
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
కోచి మెట్రో రైల్ లిమిటెడ్ ఈ వాటర్ మెట్రో నిర్వహణ బాధ్యతలను చూసుకుంటుంది. ఈ మెట్రో సర్వీస్లో బ్యాటరీ సాయంతో నడిచే మొత్తం 78 ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్లు అందుబాటులో ఉంటాయి. వీటి కోసం 38 టెర్మినల్స్ నిర్మించారు. కోచి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ.. ఈ వాటర్ మెట్రో రాకపోకలను సాగిస్తుంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీకి చెందిన ఫండింగ్ సంస్థ కేఎఫ్డబ్ల్యూ(KfW) సంయుక్తంగా కలిసి.. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ను రూ.1,136.83 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది పూర్తిగా విద్యుత్ సహాయంతో పని చేస్తుంది. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేశారు. ప్రస్తుతానికైతే.. రోజూ 12 గంటల పాటు ఈ మెట్రో సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఓడల్లో ఏసీ, వైఫై సౌకర్యాలూ ఉన్నాయి.
Round The World Cruise: ప్రయాణికుడ్ని వదిలి క్రూజ్ షిప్ జంప్.. 17 లక్షలు స్వాహా
ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రారంభ ధర రూ.20 కాగా.. గరిష్ట టికెట్ ధర రూ.40 గా కేటాయించారు. అంతేకాదు.. పాస్ల సౌకర్యాన్ని కూడా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చింది. వారం రోజుల పాస్ ఖరీదు రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ.600 గానూ, మూడు నెలల పాస్ ఖరీదు రూ.1500 గానూ నిర్ణయించారు. దక్షిణాసియాలోనే తొలి వాటర్ మెట్రో ఇదేనని, దీని ద్వారా కోచి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. దశల వారీగా ఈ సర్వీసుల సంఖ్య పెంచనున్నట్లు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
-
God Of War : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న Jr. NTR – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!