Operation Kaveri: కల్లోలిత ఆఫ్రికా దేశం సూడాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో భారత ప్రభుత్వం ఇండియాకు తరలిస్తోంది. తాజాగా తొలి విడత భారతీయులతో ఢిల్లీకి విమానం చేరుకుంది. సూడాన్ సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు ఆ దేశంలో సంక్షోభానికి దారితీశాయి.
సూడాన్లో మూడు రోజుల కాల్పుల విరమణ కదిలించింది. దేశం గందరగోళంలోకి లోతుగా మునిగిపోతుందనే భయాలను పెంచింది. భారతదేశం తన పౌరులను సంఘర్షణ ప్రాంతం నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు మూడు బ్యాచ్లలో భారతీయ పౌరులను తరలించింది.
CM YS Jagan: సూడాన్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.. వారు స్వస్థలాలకు చేరేంతవరకూ అండగా నిలవాలని స్పష్టం చేశారు.. దీని కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలి.. విమాన టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని.. ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకుని వారి స్వస్థలాలకు…