India: సొంత ప్రజలను బాంబులతో చంపుకుంటుంది.. యూఎన్లో పాక్ ఉపాన్యాసంపై భారత్ ధ్వజం
- సొంత ప్రజలను బాంబులతో చంపుకుంటుంది
- అలాంటి దేశం ఉపాన్యాసాలు ఇవ్వడం విడ్డూరం
- యూఎన్లో పాక్ ఉపాన్యాసంపై భారత్ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ వేదికగా భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్కు భారత దౌత్యవేత్త పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం.. తమపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ తిప్పికొట్టారు.
ఐక్యరాజ్యసమితిలో మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా.. కాశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరిస్తున్నారని పాకిస్థాన్ అధికారి సౌమా సలీమ్ ఆరోపించింది. అంతే ధీటుగా భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. సొంత ప్రజలను బాంబులతో చంపుకునే దేశం ఏదో ప్రపంచానికి తెలుసు అంటూ తిప్పికొట్టారు. తప్పుదారి పట్టించడానికి.. అతిశయోక్తితో ప్రపంచ దృష్టి మరల్చేందుకు పాకిస్థాన్ వక్రబుద్ధి ప్రదర్శిస్తుందంటూ భారత్ తిప్పికొట్టింది. తమ దేశ పౌరులను ఎలా కాపాడుకుంటామో ప్రపంచానికి తెలుసు అని హరీష్ పేర్కొన్నారు.
Also Read
- White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
- Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
ఇది కూడా చదవండి: Congress Meeting: నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..
1971లో ఆపరేషన్ సెర్చ్లైట్ను నిర్వహించింది పాకిస్థాన్ అని గుర్తుచేసూ దాయాది తీరును ఖండించారు. ఆ సమయంలో పాక్ సైన్యం ఒక క్రమబద్ధమైన జాతి విధ్వంసక సామూహిక అత్యాచారాన్ని నిర్వహించిందని.. 4,00,000 మంది మహిళలను క్రమబద్ధమైన మారణహోమం, సామూహిక అత్యాచారాలను చేసిందని గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన మానవ హక్కుల రికార్డులను కలిగి ఉన్న దేశం పాకిస్థాన్ అని ధ్వజమెత్తారు. ఇతరులపై వేలు చూపించే ముందు సొంత మతపరమైన మైనారిటీలపై రాజ్య హింస, వ్యవస్థాగత వివక్షను గుర్తుంచుకోవాలని భారత్ హితవు పలికింది.
ఇది కూడా చదవండి: SSMB29 : జక్కన్న స్పెషల్ ప్లాన్.. మహేశ్ -ప్రియాంక చోప్రా ఫోక్ సాంగ్ రెడీ!
‘‘మానవ హక్కుల రికార్డు ఇంత దారుణంగా ఉన్న దేశం ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడానికి ధైర్యం చేయడం చాలా విడ్డూరం’’ అని జెనీవాలోని భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కె.ఎస్. మహమ్మద్ హుస్సేన్ గత మంగళవారం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 60వ సమావేశంలో జరిగిన సాధారణ చర్చ సందర్భంగా వ్యాఖ్యానించారు.
PR @AmbHarishP delivered India’s statement at the UNSC Open Debate on Women Peace and Security marking 25 years of Resolution 1325.
Quoting EAM @DrSJaishankar, he described women peacekeepers as “messengers of peace” and outlined India’s rich and pioneering… pic.twitter.com/SesXRFRJbU
— India at UN, NY (@IndiaUNNewYork) October 6, 2025
తాజావార్తలు
-
Ragi Vadiyalu: అమ్మమ్మల కాలం నాటి టేస్ట్.. హెల్తీ రాగి వడియాలను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Japanese Skin Care : మెరిసే చర్మం కోసం జపనీస్ రహస్యం.. ఇంట్లోనే మీ ముఖాన్ని యవ్వనంగా మార్చుకోండి.!
-
Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?