India Pakistan War: ‘‘ఆ నవ్వు చెబుతుంది, పాకిస్తాన్ నష్టం గురించి’’..
- త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్ సమావేశం..
- సమావేశంలో నవ్వుతూ ఉల్లాసంగా కనిపించిన రక్షణమంత్రి, అధికారులు..
- పాకిస్తాన్ నష్టం గురించి ఆ నవ్వు చెబుతుందని నెటిజన్ల కామెంట్స్..
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, రావల్పిండి సహా అనేక ప్రధాన నగరాలపై భారత్ విరుచుకుపడింది. బయటకు చెప్పుకోలేకపోతున్నా భారత్ దెబ్బకు పాక్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎఫ్-16, జేఎఫ్-17 వంటి విమానాలను భారత్ నేలకూల్చినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, శుక్రవారం(ఈ రోజు) రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. క్లోజ్డ్ డోర్ మీటింగ్ నిర్వహించారు. అయితే, ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, ఇతర సైనికాధికారులు ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతుంది. ‘‘ మీ నవ్వు చెబుతోంది, పాకిస్తాన్కి ఎలాంటి నష్టం జరిగిందనేది’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Pakistan: ‘‘మా ప్రధాని పిరికివాడు, మోడీ అంటే వణుకు’’.. షహబాజ్ షరీఫ్పై సొంత ఎంపీల ఆగ్రహం..
రాజ్నాథ్ సింగ్తో సహా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ K త్రిపాఠి హాజరైన ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాకిస్తాన్ జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాలపై గురువారం రాత్రి సమయంలో డ్రోన్,క్షిపణి దాడులు నిర్వహించిన 24 గంటల్లోపే ఈ సమావేశం జరిగింది. సమావేశంలో అందరూ ఎంతో ప్రశాంతంగా, నవ్వుతూ కనిపించడం చూస్తే పాకిస్తాన్ని ఏ విధంగా దెబ్బకొట్టారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
భారతదేశానికి ఉన్న ఎస్-400, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్స్ పాక్ ప్రయత్నాలను గాలిలోనే బూడిద చేశాయి. పాకిస్తాన్ పంపిన మొత్తం 50 డ్రోన్లు, క్షిపణులను మన ఎయిర్ డిఫెన్స్ సమర్థవంతంగా గుర్తించి అడ్డుకుని, నాశనం చేసింది. ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ టార్గెట్గా బహుళ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!