India at UNSC: రష్యాకు షాక్.. ఉక్రెయిన్పై తీర్మానానికి భారత్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Abstains On Russian-Sponsored Resolution Against Ukraine At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ పై రష్యా ప్రతిపాదించిన తీర్మానానికి భారత్ దూరంగా ఉంది. అమెరికా, ఉక్రెయిన్ ల్యాబుల్లో ‘సైనిక జీవసంబంధ కార్యకలాపాలు’ జరుగుతున్నాయని రష్యా ఆరోపిస్తూ.. ఈ తీర్మానాన్ని భద్రతా మండలి ముందుకు తీసుకువచ్చింది. దీన్ని పరిశోధించేందుకు ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని రష్యా కోరింది. జీవ ఆయుధాల ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని రష్యా ఆరోపించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలు అయిన ఐదు దేశాల్లో చైనా, రష్యాలే ఈ తీర్మాణానికి అనుకూలంగా ఓటేశారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. భారతదేశంతో సహా, ఇతర తాత్కాలిక సభ్యదేశాలు అన్ని ఈ తీర్మానానికి గైర్హాజరు అయ్యాయి.
Read Also: PM Narendra Modi: “మజెల్ తోవ్ మై ఫ్రెండ్”.. బెంజమిన్ నెతన్యాహూకు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
యూఎన్ లోని భారతదేశ శాశ్వత మిషన్ కౌన్సిలర్ అమర్ నాథ్ మాట్లాడుతూ.. భారతదేశం బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్(బీడబ్ల్యూసీ) ఒప్పందానికి ప్రాధాన్యాత ఇస్తోందని.. బీడబ్ల్యూసీని మరింతగా మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్..రష్యా ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది తప్పుడు సమాచారం అని అన్నారు. ఈ ఆరోపణలపై రష్యా సాక్ష్యాలు అందించడంలో విఫలమైందని అన్నారు. రష్యా మాత్రం భద్రతా మండలిలో ఈ తీర్మానం ఒక ముఖ్యమైన మైలురాయి అని అభివర్ణించింది.
గతంలో కూడా పలుమార్లు ఐక్యరాజ్యసమితిలో భారత్, రష్యా-ఉక్రెయిన్ వ్యవహారాలకు దూరంగా ఉంది. ఇరు దేశాలు కూడా దౌత్యం, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. పలు మార్లు రష్యాకు వ్యతిరేకంగా వెస్ట్రన్ దేశాలు ప్రతిపాదించిన తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. ఈ అంశంలో భారత్ సమదూరాన్ని పాటిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా వ్యవహారంలో భారత్ ప్రతీసారి గైర్హాజరు కావడంపై పాశ్చాత్య దేశాలు కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేశాయి. అక్కడి మీడియా భారత్ ను నిందిస్తూ రష్యాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని పలు కథనాలను కూడా ప్రసారం చేసింది.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..