భారత్పై ఐఎంఫ్ ప్రశంసలు.. కరోనాపై స్పందన భేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.. కొన్ని దేశాలు కోలుకోలేని స్థాయిలో దెబ్బతిన్నాయి… అయితే, భారత్పై ప్రశంసలు కురిపించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్).. కరోనా సమయంలో భారత ప్రభుత్వం వేగంగా, చెప్పుకోదగ్గ రీతిలో స్పందించిందని పేర్కొంది ఐఎంఎఫ్.. కోవిడ్ సమయంలో సైతం కార్మిక సంస్కరణలు, ప్రైవేటీకరణను కొనసాగించిందని తెలిపింది.. కానీ, ఆర్థిక పరిస్థితులు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి.. అయితే, ఊహించిన దాని కంటే వేగంగా కోలుకునే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. పెట్టుబడులు, ఇతర వృద్ధి కారకాలపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావం నిలకడగా కొనసాగుతోందని.. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం మరింత ఆలస్యం కావచ్చునని తెలిపింది.
కరోనా మహమ్మారి పరిస్థితులను భారత ప్రభుత్వం ధీటుగా, వేగంగా ఎదుర్కొందని ప్రశంసించింది ఐఎంఎఫ్.. ప్రజలకు ఆర్థిక మద్దతును అందజేసిందని, బలహీన వర్గాలకు సాయం చేసిందని, ద్రవ్య విధానాన్ని సులభతరం చేసిందని పేర్కొంది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ… లిక్విడిటీ ప్రావిజన్ను పెంచిందని, నియంత్రణ విధానాలను పటిష్టపరిచిందని తెలిపింది.. కరోనా మహమ్మారిపై భారత అధికారుల ప్రతిస్పందనను ఐఎంఎఫ్ డైరెక్టర్లు ప్రశంసించారు. ఆర్టికల్ IV కన్సల్టేషన్స్ అని పిలవబడే నివేదికలో ఐఎంఎఫ్ ఈ విషయాలను వెల్లడించింది.. అయితే, కోవిడ్ -19 మహమ్మారి నుండి వచ్చే ప్రమాదాల గురించి హెచ్చరించింది, ముఖ్యంగా ప్రజల అభివృద్ధిపై హానికరమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. మహమ్మారికి సంబంధించిన అనిశ్చితులు కారణంగా.. భారీ నష్టాలు ఏర్పడుతున్నాయి. పెట్టుబడి, మానవ వనరులు, మూలధనం, ఇతర వృద్ధి డ్రైవర్లపై కోవిడ్ -19 యొక్క నిరంతర ప్రతికూల ప్రభావం ఉందని… వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపింది.
Also Read
- Iran Missile Attack: ముదురుతున్న యుద్ధం.. హార్ముజ్లో యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణులు దాడులు
- US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
- Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
- Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
ఇక, ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి సమీప కాల పాలసీ ప్రాధాన్యత ఉందని డైరెక్టర్లు అంగీకరించారు. ఆ సందర్భంలో, ఇటీవల వ్యాక్సినేషన్ పెరుగుదలను స్వాగతించారు.. మహమ్మారికి ముందు దశాబ్దంలో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటి, మిలియన్ల మందిని పేదరికం నుండి బయటపడేసిందని పేర్కొంది.. కోవిడ్ -19 షాక్కు ముందు ఆర్థిక వ్యవస్థ మోడరేట్ చేస్తున్నప్పుడు, మహమ్మారి అపూర్వమైన సవాళ్లను సూచిస్తుందని తెలిపింది. కోవిడ్ -19 సెకండ్ వేవ్.. ఆరోగ్యం మరియు ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి, అయితే, ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటుందని విరించింది. 2020-21లో మునుపెన్నడూ లేని విధంగా 7.3 శాతం సంకోచించింది. రెండవ వేవ్ మరో పదునైన ఫలితాన్ని ఇచ్చిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని.. 2022-23లో 8.5 శాతం వృద్ధి సాధిస్తోందని అంచనా వేసింది ఐఎంఎఫ్.
తాజావార్తలు
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!