Pakistan: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
- పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది.
ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. హిందూ ఆలయాలు దాడులకు గురికావడంతో దెబ్బతిన్నాయి. అయితే హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లకు అక్కడ ప్రభుత్వం నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని పునర్నిర్మించడానికి సిద్ధపడింది.
Also Read
- Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రత
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్లో భూకంపం..
- Iran-Israel War: ఒకేసారి నాలుగు వైపుల నుంచి ఇజ్రాయెల్పై దాడి? ఇరాన్ భారీ వ్యూహం
ఇది కూడా చదవండి: Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు.. ఎగబడిన జనం
ప్రస్తుతం గుడి నిర్మాణాన్ని ద ఎవాక్యూ ట్రస్ట్ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దీన్ని ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్ ధర్మస్థాన్ కమిటీ అధ్యక్షుడు సావన్ చంద్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!
అధికారిక అంచనాల ప్రకారం పాకిస్థాన్లో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. సమాజం ప్రకారం దేశంలో 90 లక్షల మంది వరకు హిందువులు నివసిస్తున్నారు. హిందూ జనాభా ఎక్కువ మంది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు. తోటి ముస్లిం వారితో సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు. పాకిస్తాన్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami: షమీ ఫిట్నెస్పై బిగ్ అప్డేట్.. ఆస్ట్రేలియా టూర్కు స్టార్ బౌలర్..!
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!