Pakistan: పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
- పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.కోటి బడ్జెట్ కేటాయించినట్లు సోమవారం మీడియాకు తెలిపింది. పంజాబ్ ప్రావిన్స్లో ఈ హిందూ దేవాలయం 1960 నుంచి పని చేయకుండా పోయింది. మొత్తానికి ఇన్నాళ్లకు మోక్షం లభించింది.
ఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్లో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. హిందూ ఆలయాలు దాడులకు గురికావడంతో దెబ్బతిన్నాయి. అయితే హిందువులు గుడికి వెళ్లాలంటే లాహోర్ లేదా సియాల్కోట్కు వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గుడిని పునర్నిర్మించాలని పాక్ ధర్మస్థాన్ కమిటీ 20 ఏళ్ల క్రితమే సిఫారసు చేసింది. మొత్తానికి ఇన్నాళ్లకు అక్కడ ప్రభుత్వం నరోవల్ జిల్లాలోని బావోలీ సాహిబ్ గుడిని పునర్నిర్మించడానికి సిద్ధపడింది.
Also Read
ఇది కూడా చదవండి: Currncy Notes in Drain: మురికి కాలువలో రూ.500 నోట్లు.. ఎగబడిన జనం
ప్రస్తుతం గుడి నిర్మాణాన్ని ద ఎవాక్యూ ట్రస్ట్ప్రాపర్టీ బోర్డు(ఈటీపీబీ) పర్యవేక్షిస్తోంది. గుడి పూర్తయిన తర్వాత దీన్ని ధర్మస్థాన్ బోర్డుకు అప్పగిస్తారు. పాక్ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన షోయబ్ సిద్దాల్ నేతృత్వంలోని ఏక సభ్య కమిటీ చైర్మన్ షోయబ్ సిద్దాల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యుడు మంజూర్ మసీ గుడి పునర్నిర్మించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుడిని మళ్లీ నిర్మిస్తున్నందుకు పాక్ ధర్మస్థాన్ కమిటీ అధ్యక్షుడు సావన్ చంద్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి: The Raja Saab: గళ్ళ కోటు.. నల్ల ఫ్యాంటు.. టీ షర్ట్..బాబు లుక్ అదిరిందంతే!
అధికారిక అంచనాల ప్రకారం పాకిస్థాన్లో 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. సమాజం ప్రకారం దేశంలో 90 లక్షల మంది వరకు హిందువులు నివసిస్తున్నారు. హిందూ జనాభా ఎక్కువ మంది పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో స్థిరపడ్డారు. తోటి ముస్లిం వారితో సంస్కృతి, సంప్రదాయాలు, భాషను పంచుకుంటారు. పాకిస్తాన్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Mohammed Shami: షమీ ఫిట్నెస్పై బిగ్ అప్డేట్.. ఆస్ట్రేలియా టూర్కు స్టార్ బౌలర్..!
తాజావార్తలు
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
-
Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
-
El Nino: భారత్కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
-
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..