Syria-Lebanon: సిరియాలో ఉద్రిక్తత.. 2 వేల యోధులను పంపిన లెబనాన్
- సిరియాలో ఉద్రిక్తత
- డమాస్కస్ స్వాధీనం చేసుకోనున్న రెబల్స్
- 2 వేల యోధులను పంపిన లెబనాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరికాసేపట్లో సిరియా రాజధాని డమాస్కస్ను రెబల్స్ స్వాధీనం చేసుకోనున్నారు. అతి సమీపంలో తిరుగుబాటుదారులు ఉన్నారు. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని డమాస్కస్ స్వాధీనం చేసుకుంటే సిరియా దేశం రెబల్స్ హస్తగతం అయినట్లే.
ఇది కూడా చదవండి: HYDRA Commissioner: మూసీ పరివాహకంలో మట్టిపోసిన నిర్మాణ సంస్థలపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం
Also Read
- Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
- Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ఇదిలా ఉంటే తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు హిజ్బుల్లాకు చెందిన 2,000 మంది యోధులను లెబనాన్ సిరియాకు పంపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సిరియాలోని క్యుసైర్ ప్రాంతానికి యోధులను పంపినట్లు సమాచారం. సిరియాలో హిజ్బుల్లా తన స్థానాలను కాపాడుకోవడానికి యోధులను పంపినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సిరియన్ తిరుగుబాటుదారులతో ఇంకా ఎటువంటి యుద్ధాల్లో పాల్గొనలేదని సమాచారం. ఇదిలా ఉంటే సాయుధ తిరుగుబాటుదారులను ఎదుర్కొనేందుకు ఇరాన్-మద్దతుగల ఇరాకీ మిలీషియాలు కూడా సిరియాలో మోహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు డమాస్కస్ సరిహద్దుల్లోంచి సైన్యం పారిపోయినట్లుగా వస్తున్న వార్తలను సిరియా రక్షణ శాఖ ఖండించింది. ఆ వార్తలను కొట్టిపారేసింది.
ఇది కూడా చదవండి: Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
సిరియాలోని తిరుగుబాటు కూటమి ఇప్పటికే సిరియాలోని రెండు ప్రధాన నగరాలు, ఉత్తరాన అలెప్పో, హమాను స్వాధీనం చేసుకుంది. 2011 నుంచి సిరియా యుద్ధంలో అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దళాలతో కలిసి పోరాడారు. అయితే తాజాగా అధ్యక్షుడు పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రక్షణ శాఖ మాత్రం ఖండిస్తుంది. గత వారం ఇస్లామిస్ట్ నేతృత్వంలోని తిరుగుబాటుదారుల దాడి ప్రారంభమైనప్పటి నుంచి హిజ్బుల్లా నుంచి గానీ.. ఇరాన్ నుంచి సరైన సపోర్ట్ దొరకలేదని తెలుస్తోంది. నవంబర్ 27న హెజ్బుల్లా- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. దీంతో లెబనీస్ సమూహం ఊపిరిపీల్చుకుంది. తాజాగా సిరియా తిరుగుబాటుదారుల ద్వారా ముప్పు పొంచి ఉండడంతో హిజ్బుల్లా ఎలాంటి సాహసం చేస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Fire Breaks Out In Running Car: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు.. పరుగులు తీసిన భక్తులు
తాజావార్తలు
-
Emmanuel Macron: నటి మెసేజ్లే కారణమా..? ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్కు భార్య చెంపదెబ్బ!
-
Prateek Yadav: అల్లుడి చితికి నిప్పంటించిన మామ.. మాజీ సీఎం తమ్ముడి అంత్యక్రియలు పూర్తి
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?