Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- సిరియా సైన్యం పరార్
- తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డమాస్కస్కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరం సమీపంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. డమాస్కస్లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూపు నేతృత్వంలోని ఇస్లామిస్ట్ నేతృత్వంలోని సంకీర్ణం.. రాజధానిని ఆక్రమించుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టడం ప్రారంభించినట్లు సిరియన్ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు శనివారం రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టే చివరి దశలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ దళాలు నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఉపసంహరణ జరగలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్కి సెక్యూరిటీ సమస్య..
సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ వెళ్లొద్దని ఎంబసీ తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీతో టచ్లో ఉండాలని తెలిపింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
తాజావార్తలు
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!