Syria: సైన్యం పరార్.. తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- సిరియా సైన్యం పరార్
- తిరుగుబాటుదారుల చేతుల్లోకి రాజధాని డమాస్కస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిరియా తిరుగుబాటుదారుల హస్తగతం కాబోతుంది. ఇప్పటికే పలు నగరాలు స్వాధీనం చేసుకున్న రెబల్స్.. మరికొన్ని నిమిషాల్లోనే రాజధాని డమాస్కస్ను కూడా స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డమాస్కస్కు 20 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుబాటుదారులు ఉన్నారు. రాజధానిని చుట్టుముట్టడం ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు నగరం సమీపంలో ఉన్న సైన్యం పారిపోయినట్లు సమాచారం. అయితే ఈ వార్తలను సిరియా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. డమాస్కస్లో సాయుధ బలగాలు ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: S Jaishankar: “బ్రిక్స్ కరెన్సీ ప్రతిపాదన లేదు”.. ట్రంప్ వార్నింగ్ తర్వాత జైశంకర్ ప్రకటన..
Also Read
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో అంతర్జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
- Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
హయత్ తహ్రీర్ అల్-షామ్ గ్రూపు నేతృత్వంలోని ఇస్లామిస్ట్ నేతృత్వంలోని సంకీర్ణం.. రాజధానిని ఆక్రమించుకోబోతున్నట్లు ప్రకటించింది. రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టడం ప్రారంభించినట్లు సిరియన్ తిరుగుబాటుదారులు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు శనివారం రాజధాని డమాస్కస్ను చుట్టుముట్టే చివరి దశలో ఉన్నారని పేర్కొన్నారు. అయితే బషర్ అల్-అస్సాద్ ప్రభుత్వ దళాలు నగరానికి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి ఎటువంటి ఉపసంహరణ జరగలేదని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh: పాకిస్తాన్ కోసం బంగ్లాదేశ్ కీలక నిర్ణయం.. భారత్కి సెక్యూరిటీ సమస్య..
సిరియాలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులెవరూ వెళ్లొద్దని ఎంబసీ తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచిస్తున్నట్లు పేర్కొంది. భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని చెప్పింది. అత్యవసర పరిస్థితుల్లో డమాస్కస్లోని ఇండియన్ ఎంబసీతో టచ్లో ఉండాలని తెలిపింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!