Groundwater Pumping: “భూమి భ్రమణ అక్షాన్ని” మారుస్తున్న భూగర్భ జలాల వినియోగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Groundwater Pumping: భూమిపై విచ్చల విడిగా భూగర్భ జలాలను తోడేస్తున్నాము. ఏటా కొన్ని మిలియన్ టన్నుల నీటిని మానవుడు తన అవసరాల కోసం వాడుతున్నాడు. అయితే దీని నుంచి ఎదురయ్యే పరిణామాలను పట్టించుకోవడం లేదు. భూమి అంతర్భాగం నుంచి నీటిని తోడేసి వాటిని వేరే చోటుకు పంపడం ఏకంగా భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షంపై కూడా ఇది ప్రభావం చూపిస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. భూగర్భ జలాల తోడేయడం వల్ల 1993 నుంచి 2010 మధ్య కాలంలో భూమి ఏకంగా దాదాపుగా 80 సెంటీమీటర్లు తూర్పువైపు వంగింది. ఈ వివరాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. భూమి యొక్క భ్రమణాన్ని మార్చగల నీటి సామర్థ్యం 2016లో కనుగొనబడిందని పరిశోధకులు గుర్తించారు.
Read Also: Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది
Also Read
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
1993-2010 మధ్యకాలంలో 6 మిల్లీమీటర్ల సముద్ర మాట్టం పెరుగుదలకు సమానమైన 2,150 గిగా టన్నుల( 2 ట్రిలియన్ టన్నులు) భూగర్భ జలాలను కోల్పోయాం. ఈ మధ్యకాలంలో భౌగోళిక ఉత్తర ధ్రువం సంవత్సరానికి 4.36 సెంటీమీటర్ల వేగంతో మారడానికి కారణమైందని పరిశోధకులు లెక్కించారు. వాతావరణ సంబంధిత కారణాల్లో భూగర్భ జలాల పంపిణి వాస్తవానికి భ్రమణ ధ్రువంపై అతిపెద్ద ప్రభావం చూపిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీలో జియోఫిజిసిస్ట్ కి-వీన్ సియో చెప్పారు. అధ్యయన కాలంలో పశ్చిమ ఉత్తర అమెరికా, వాయువ్య భారతదేశంలో ఎక్కువ నీరు రీడిస్ట్రిబ్యూషన్ జరిగిందని కనుగొన్నారు.
భూమి భ్రమణ అక్షం సాధారణంగా ఒక సంవత్సరంలో అనేక మీటర్లు మారుతుంది. కాబట్టి భూగర్భ జలాల పంపింగ్ రుతువులపై పెద్దగా మార్పులు సంభవించవు. అయితే భౌగోళిక సమయ ప్రమాణాలపై, ధ్రువ ప్రవాహం వాతావరణంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెప్పారు. నీటి ద్రవ్యరాశిలో మార్పులు భూమి యొక్క అక్షం వంపుకు కారణం అవుతున్నాయి. హిమానీనదాలు మరియు మంచు గడ్డలు కరిగించడం వల్ల కూడా ఇది సంభవిస్తుంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..