Nigeria: మాజీ ప్రియుడి హత్యకు ప్రియురాలి కుట్ర.. విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- మాజీ ప్రియడి హత్యకు ప్రియురాలి కుట్ర
- విషపూరితమైన సూప్ తాగి ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో చాలా మంది యవసులో ఉన్నప్పుడు ప్రేమించుకుంటారు. కలిసి తిరుగుతుంటారు. విడిపోతుంటారు. ఇలా కామన్గా జరిగిపోతూ ఉంటాయి. కొందరు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. మరికొందరు మనస్పర్థలు వచ్చి మధ్యలోనే విడిపోతుంటారు. ఎవరిదారి వారు చూసుకుంటారు. కొందరైతే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. కసి తీర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంటారు. ఇలానే ఓ ప్రియురాలి.. మాజీ ప్రియుడి హత్యకు కుట్ర చేసింది. ఇంకేముంది.. సూప్లో విషం కలిపి ఇచ్చింది. ఇదేమీ తెలియని ఆ వ్యక్తి.. తన నలుగురి స్నేహితులతో షేర్ చేసుకున్నాడు. అది తిన్నకాసేపటికే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రియురాలి.. మాజీ ప్రియుడికి స్పాట్ పెడితే.. అతడితో పాటు అన్యంపుణ్యం ఎరుగని మరో నలుగురి జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయాయి. ఈ దారుణ ఘటన నైజీరియాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
Also Read
- Hindu Temple Demolition: పాకిస్థాన్లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
నైజీరియాలోని ఎడో స్టేట్లోని ఓ ఇంట్లో సూప్ తాగి ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ప్రతీకారం తీర్చుకోవాలని ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడు తినాల్సిన సూప్లో విషం కలిపింది. ఆమె మాజీ ప్రియుడు తన నలుగురు స్నేహితులతో సూప్ను పంచుకున్నాడు. సూప్ తాగి ఐదుగురు చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 16 ఏళ్ల ఐషా సులేమాన్గా గుర్తించిన బాలికను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు బంధాన్ని తెంచుకున్నందుకే ఆమె ఈ హత్యకు కుట్ర పన్నినట్లు తేల్చారు.
ఇది కూడా చదవండి: TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
స్థానిక పోలీసుల ప్రకారం.. మృతులు ఇమ్మాన్యుయేల్ ఎలోగీ (19), అడా శామ్యూల్ (16), సోదరులు శామ్యూల్, జెఫ్రీ అయెగ్వాలో, నూరుదీన్గా గుర్తించారు. ఈ నలుగు ఇమ్మాన్యుయేల్ నివాసంలో చనిపోయారు. వివిధ గదుల్లో శవాలుగా పడి ఉన్నట్లు గుర్తించారు. కొందరు మంచం మీద.. ఇంకొందరు ఇతరులు గదిలో చనిపోయారు. ఇమ్మాన్యుయేల్ తండ్రి ఎలోజీ ఎజెకిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. 16ఏళ్ల ఐషా సులేమాన్ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
తాజావార్తలు
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
-
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!