TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
- టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి
- ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి
- మన దేశంలో చాలా మంది టీబీ రోగులు
- భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైన అంటు వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు ఇండియాలో 26%, ఇండోనేషియాలో 10%, చైనాలో 6.8%, ఫిలిప్పీన్స్లో 6.8%, పాకిస్తాన్లో 6.3% మంది ఉన్నారు. గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ వ్యాధి భారం ప్రపంచవ్యాప్తంగా 56 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 55 శాతం మంది పురుషులలో.. 33 శాతం మంది స్త్రీలలో.. 12 శాతం మంది పిల్లలు, యువతలో కనుగొన్నారు.
ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 2023లో 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడినట్లు అంచనా వేశారు. టీబీ సంబంధిత మరణాల సంఖ్య 2022లో 1.32 మిలియన్లు ఉండగా.. 2023లో 1.25 మిలియన్లకు తగ్గినట్లు అంచనా వేశారు. 2023లో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య కొద్దిగా పెరిగి 10.8 మిలియన్లకు చేరుకుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స పూర్తిగా సాధ్యమే కానీ.. ఒకసారి ఆలస్యం జరిగితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికీ దగ్గుతూ ఉన్నట్లయితే పరీక్షించి, సరైన చికిత్స చేసుకోవాలి.
Also Read
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
Read Also: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తి ఈ టీబీ బ్యాక్టీరియాతో సంబంధంలోకి వచ్చినప్పుడు.. ఈ బ్యాక్టీరియా శ్వాస ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులలో స్థిరపడి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎక్కువగా ఈ బాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
టీబీ లక్షణాలు:
దగ్గు
రక్తం, శ్లేష్మంతో దగ్గు
ఛాతీలో నొప్పి
శ్వాస లేదా దగ్గు సమయంలో నొప్పి
జ్వరం
చలి
రాత్రి చెమటలు
బరువు తగ్గడం
తినే కోరికలు లేకపోవడం
అలసిపోయిన అనుభూతి కలిగి ఉండటం.
టీబీ సాధారణ లక్షణం నిరంతర దగ్గు.. కాబట్టి దగ్గు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లైతే, చెక్ చేసుకుని తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. అలాగే పూర్తి జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందాలి.
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!