TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
- టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి
- ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి
- మన దేశంలో చాలా మంది టీబీ రోగులు
- భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైన అంటు వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు ఇండియాలో 26%, ఇండోనేషియాలో 10%, చైనాలో 6.8%, ఫిలిప్పీన్స్లో 6.8%, పాకిస్తాన్లో 6.3% మంది ఉన్నారు. గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ వ్యాధి భారం ప్రపంచవ్యాప్తంగా 56 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 55 శాతం మంది పురుషులలో.. 33 శాతం మంది స్త్రీలలో.. 12 శాతం మంది పిల్లలు, యువతలో కనుగొన్నారు.
ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 2023లో 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడినట్లు అంచనా వేశారు. టీబీ సంబంధిత మరణాల సంఖ్య 2022లో 1.32 మిలియన్లు ఉండగా.. 2023లో 1.25 మిలియన్లకు తగ్గినట్లు అంచనా వేశారు. 2023లో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య కొద్దిగా పెరిగి 10.8 మిలియన్లకు చేరుకుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స పూర్తిగా సాధ్యమే కానీ.. ఒకసారి ఆలస్యం జరిగితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికీ దగ్గుతూ ఉన్నట్లయితే పరీక్షించి, సరైన చికిత్స చేసుకోవాలి.
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
Read Also: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తి ఈ టీబీ బ్యాక్టీరియాతో సంబంధంలోకి వచ్చినప్పుడు.. ఈ బ్యాక్టీరియా శ్వాస ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులలో స్థిరపడి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎక్కువగా ఈ బాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
టీబీ లక్షణాలు:
దగ్గు
రక్తం, శ్లేష్మంతో దగ్గు
ఛాతీలో నొప్పి
శ్వాస లేదా దగ్గు సమయంలో నొప్పి
జ్వరం
చలి
రాత్రి చెమటలు
బరువు తగ్గడం
తినే కోరికలు లేకపోవడం
అలసిపోయిన అనుభూతి కలిగి ఉండటం.
టీబీ సాధారణ లక్షణం నిరంతర దగ్గు.. కాబట్టి దగ్గు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లైతే, చెక్ చేసుకుని తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. అలాగే పూర్తి జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందాలి.
తాజావార్తలు
-
Animal Facts: ఒంటెలకు బతికున్న పాములను ఎందుకు తినిపిస్తారు? ఈ ఆచారం వెనుక అసలు నిజమేంటి?
-
JR NTR Office : ‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆఫీస్
-
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!