TB Disease: ప్రమాదకరంగా మారుతున్న ఈ అంటు వ్యాధి.. ప్రతి ఏడాది లక్షల్లో మృత్యువాత
- టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి
- ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాప్తి
- మన దేశంలో చాలా మంది టీబీ రోగులు
- భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీబీ అనేది ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి సులభంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి మన దేశంలో కూడా చాలా మంది టీబీ రోగులు ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. భారతదేశంతో సహా ఐదు దేశాలలో అత్యధిక సంఖ్యలో టీబీ రోగులు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైన అంటు వ్యాధిగా చెబుతున్నారు. ఈ వ్యాధిగ్రస్తులు ఇండియాలో 26%, ఇండోనేషియాలో 10%, చైనాలో 6.8%, ఫిలిప్పీన్స్లో 6.8%, పాకిస్తాన్లో 6.3% మంది ఉన్నారు. గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం.. ఈ వ్యాధి భారం ప్రపంచవ్యాప్తంగా 56 శాతం ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి 55 శాతం మంది పురుషులలో.. 33 శాతం మంది స్త్రీలలో.. 12 శాతం మంది పిల్లలు, యువతలో కనుగొన్నారు.
ఇటీవలి WHO నివేదిక ప్రకారం.. 2023లో 8.2 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడినట్లు అంచనా వేశారు. టీబీ సంబంధిత మరణాల సంఖ్య 2022లో 1.32 మిలియన్లు ఉండగా.. 2023లో 1.25 మిలియన్లకు తగ్గినట్లు అంచనా వేశారు. 2023లో మధుమేహంతో బాధపడుతున్న వారి సంఖ్య కొద్దిగా పెరిగి 10.8 మిలియన్లకు చేరుకుంది. దీని వల్ల ప్రతి సంవత్సరం లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధికి చికిత్స పూర్తిగా సాధ్యమే కానీ.. ఒకసారి ఆలస్యం జరిగితే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఎప్పటికీ దగ్గుతూ ఉన్నట్లయితే పరీక్షించి, సరైన చికిత్స చేసుకోవాలి.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
Read Also: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల టీబీ వ్యాధి వస్తుంది. ఒక వ్యక్తి ఈ టీబీ బ్యాక్టీరియాతో సంబంధంలోకి వచ్చినప్పుడు.. ఈ బ్యాక్టీరియా శ్వాస ద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఊపిరితిత్తులలో స్థిరపడి తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఎక్కువగా ఈ బాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తిని సంప్రదించడం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గడం, తుమ్మడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.
టీబీ లక్షణాలు:
దగ్గు
రక్తం, శ్లేష్మంతో దగ్గు
ఛాతీలో నొప్పి
శ్వాస లేదా దగ్గు సమయంలో నొప్పి
జ్వరం
చలి
రాత్రి చెమటలు
బరువు తగ్గడం
తినే కోరికలు లేకపోవడం
అలసిపోయిన అనుభూతి కలిగి ఉండటం.
టీబీ సాధారణ లక్షణం నిరంతర దగ్గు.. కాబట్టి దగ్గు మూడు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉన్నట్లైతే, చెక్ చేసుకుని తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. అలాగే పూర్తి జాగ్రత్తలు తీసుకుని సరైన చికిత్స పొందాలి.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..