Giorgia Meloni: ‘‘జార్జ్ సొరోస్’’పై ఇటలీ ప్రధాని ఫైర్.. మస్క్, బీజేపీ ఆరోపణలకు మద్దతు..
- జార్జ్ సోరోస్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాడు..
- ఎలాన్ మస్క్కి మద్దతుగా నిలిచిన ఇటలీ ప్రధాని జార్జ్ మెలోనీ..
- భారత్లో కలుగజేసుకుంటున్నాడని బీజేపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Giorgia Meloni: బిలియనీర్ జార్జ్ సోరోస్ విదేశాల రాజకీయాల్లో జోక్యానికి పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇత దేశాల రాజకీయాల్లో కలుగుజేసుకుంటున్నారని ఆమె అన్నారు. దేశాలను అస్థిరపరచడానికి తన డబ్బును ఉపయోగిస్తున్నారని మెలోనీ గురువారం అన్నారు. యూరప్ రాజకీయాల్లో ఎలాన్ మస్క్ జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు, విమర్శలు వస్తున్న తరుణంలో మెలోనీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో యూరప్లో రాజకీయాల గురించి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి ఏ విధంగా ముప్పు కలిగించవని ఆమె చెప్పారు. ఎలాన్ మస్క్ తన వాక్ స్వేచ్ఛను మాత్రమే ఉపయోగించుకున్నారని చెప్పారు. అతను ధనవంతుడు, వామపక్షవాది కాకపోవడం కారణంగా టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు.
Also Read
- Explainer: '2012' సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
- Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
జార్జ్ సోరోస్ని ఉదాహరణగా తీసుకుని, ‘‘వామపక్ష భావాలు కలిగిన ధనవంతులు, శక్తివంతమైన వ్యక్తులు ఇతర ప్రజాస్వామ్య దేశాల రాజకీయాల్లో ఎలా జోక్యానికి పాల్పడ్డారో అందరికి తెలిసిందే, జార్జ్ సోరోస్ అలాంటి పనులే చేస్తాడు, మస్క్ ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగించడు’’ అని కామెంట్ చేసింది. సోరోస్ నుంచి డబ్బు తీసుకున్న వారిలా కాకుండా తాను ఎలాన్ మస్క్ నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదని మెలోని చెప్పారు. ఇటలీలోని తన ప్రభుత్వం ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్తో ఒక భారీ, వివాదాస్పద సైబర్ భద్రతా ఒప్పందంపై సంతకం చేయబోతోందనే మీడియా నివేదికలను కూడా ఆమె ఖండించారు.
ఇటీవల ఎలాన్ మస్క్ యూరప్ దేశాలకు చెందిన పలువురు నేతల్ని టార్గెట్ చేశారు. ముఖ్యంగా వామపక్ష భావాజాలాలు ఉన్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఇటీవల యూరప్లో జరిగిన పలు మతోన్మాద దాడులకు ఈ భావజాలమే కారణమని ఆరోపించాడు. రైటిస్ట్ లీడర్లను ఎన్నుకోవాలని యూరప్ ప్రజల్ని కోరారు.
ఇదిలా ఉంటే, భారత్ కూడా జార్జ్ సోరోస్ వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్-జార్జ్ సోరోస్ మధ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తోంది. ఈ శీతాకాల సమావేశాల్లో జార్జ్ సోరోస్ అంశంపై రాజకీయాలు నడిచాయి. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీకి అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కాశ్మీర్ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
-
Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Explainer: ‘2012’ సినిమా.. నేపాల్ విపత్తును ముందే ఊహించిందా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!